పవన్ అడగకుండానే ఎంతోమందికి ఆర్ధిక సహాయం చేస్తూ తన ఉదారతను చూపెడుతున్నాడు. అయితే పవన్ ను నమ్ముకుని గత రెండు సంవత్సరాలుగా ఎటువంటి సినిమాలు చేయకుండా పవన్ నామస్మరణతో రోజులు గడిపి ఇప్పుడు తీవ్రమైన ఆర్ధిక సమస్యల మధ్య కూరుకుపోయాడు అనే వార్తలు వస్తున్న సంపత్ నంది వ్యవహారం ఇప్పుడు ఫిలింనగర్ కు హాట్ టాపిక్ గా మారింది.  టాలీవుడ్ సినిమా రంగంలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ విషయాన్ని ఎప్పటికీ తేల్చకుండా రోజులు గడుపుతూ ఉండటంతో ఖాళీగా ఉండటం ఎందుకని నిర్మాతగా మారి సంపత్ నంది చేసిన ప్రయోగం తీవ్రంగా వికటించి సంపత్ నందిని ఆర్ధికంగా కోలుకోలేని దెబ్బ తీసింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.  సంపత్ నంది హీరో ఆదితో తీసిన ‘గాలిపటం’ సినిమాకు మంచి రివ్యూలు వచ్చినా ఆసినిమా గాలిలో ఎగరలేక పోయింది. నేటి తరం ప్రేక్షకులకు నచ్చే సన్నివేశాలు ఆ సినిమాలో పెట్టినా యూత్ ను ఆకర్షించలేకపోయింది ‘గాలిపటం’. దీనితో ఈ సినిమాకు సంబంధించి కోలుకోలేని నష్టాలు సంపత్ నందికి వచ్చాయి అని టాక్.  ఈ పరిస్థుతులకు తోడు పవన్ తో తాను తీయాలనుకున్న ‘గబ్బర్ సింగ్ 2’ సినిమాను తనచేత కాకుండా ‘పవర్’ సినిమా దర్శకుడు బాబి చేత దర్శకత్వం వహిస్తారు అని వస్తున్న వార్తలు సంపత్ నందిని మరింత బాధ పెడుతున్నాయి అని అంటున్నారు. ఈ పరిస్థుతుల నేపధ్యంలో ఏదోవిధంగా పవన్ ను కలిసి తన బాధలు చెప్పుకుని పవన్ మనసును గెలుచుకోవాలని సంపత్ నంది తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు అనే వార్తల హడావిడి వినిపిస్తోంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: