గతవారం దీపావళి సందర్భంగా కోలీవుడ్‌లో విడుదలైన ‘కత్తి’ సృష్టిస్తున్న కలెక్షన్ల సునామి కోలీవుడ్ మీడియాను షేక్ చేస్తోంది. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా ఈ వీకెండ్ పూర్తి అయ్యేసరికి 100 కోట్ల మైలురాయిని చేరుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా 82 కోట్లు రాబట్టిందని కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలను చూసి అందరూ షాక్ అవుతున్నారు.  ఈ మూవీ విడుదలకు ముందు ఎన్ని వివాదాలు వచ్చినా ఈ సినిమా ఘన విజియాన్ని ఆపలేకపోయింది. ‘కత్తి’ రెండవ వారంలోకి అడుగు పెడుతున్నా ఈ సినిమా ధియేటర్ల వద్ద భారీ స్థాయిలో ఉంటున్న జనాన్ని బట్టి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ కు దారి తీస్తుంది అనే ఊహాలను విశ్లేషకులు కూడా అంచనా వేయలేక పోతున్నారు.  ఈ వార్తలు ఇలా ఉండగా సంచలనాలు సృష్టిస్తున్న ‘కత్తి’ స్టోరీ తనదేనంటూ ఒక తెలుగు సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ రైటర్స్ అసోసియేషన్‌లో కంప్లైంట్ చేశాడని ఫిల్మ్‌నగర్ లో వార్తలు వస్తున్నాయి. ఆ అసిస్టెంట్ డైరెక్టర్ గతంలో దర్శకుడు మురుగదాస్ దగ్గర చేరడానికి ‘కత్తి’ స్టోరీ లైన్ చెప్పాడని ఆ తర్వాత అతన్ని మురగ దాస్ టీమ్ లో చేర్చుకోకుండా తర్వాత ఛాన్స్ ఇస్తానంటూ చెప్పి ఆ కథను ‘కత్తి’ గా తీశాడని ఆ అసిస్టెంట్ డైరెక్టర్ వాదన.  ఆ అసిస్టెంట్ డైరెక్టర్ చేసిన కంప్లైంట్ ఆధారంగా అతని వద్దనున్న స్క్రిప్ట్‌తో మూవీ చూసి ఈ వివాదం‌ పై తెలుగు రైటర్స్ అసోసియేషన్ రెండు, మూడు రోజుల్లో ఒక నిర్ణయానికి వచ్చి దర్శకుడు మురగ దాస్ తో ఈ విషయమై మాట్లాడి ఆ యువ రచయితకు న్యాయంచేయాలనే ఉద్దేశ్యంతో తెలుగు రైటర్స్ అసోసియేషన్ పెద్దలు అడుగులు వేస్తున్నారు అంటూ ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: