రెబల్ స్టార్ కృష్ణంరాజు సినిమా టైటిల్ పై బన్నీ మనసు పడ్డట్లుగా వార్తలు వస్తున్నాయి. ‘జులాయి’ సినిమా తర్వాత త్రివిక్రమ్, అల్లు అర్జున్ ల కాంబినేషన్ లో బన్నీ మొట్టమొదటిసారిగా ముగ్గురు హీరోయిన్స్ తో నటిస్తున్న సినిమాకు కృష్ణంరాజు నటించిన ఒకనాటి ‘త్రిశూలం’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఈ సినిమా యూనిట్ ఆలోచిస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ టైటిల్ కాకుంటే ‘కవచం’ అనే టైటిల్ గురించి కూడా త్రివిక్రమ్ ఆలోచిస్తున్నట్లు టాక్. ‘అత్తారింటికి దారేది’ తరువాత త్రివిక్రమ్, ‘రేసుగుర్రం’ తరువాత బన్నీ ఈ ఇరువురి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో నిర్మాణంలో ఉండగానే ఈ సినిమాకు బయ్యర్ల నుండి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది అనే వార్తలు వస్తున్నాయి.  ఇప్పటికే ఈ సినిమాకు నైజాంలో 15 కోట్లకు నితిన్ ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్ సంస్థ గ్లోబల్ సంస్థ తీసుకోబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఓవర్సీస్‌లో 6 కోట్ల ఫ్యాన్సీ రేట్ ఓకే అయిందని ట్రేడ్ వర్గాల సమాచారం.  ఈ విధంగానే చాల ఏరియాల నుంచి మంచి ఫ్యాన్సీ ఆఫర్స్ వస్తున్నా ఈ సినిమా నిర్మాత ఇంకా ఎవరికీ మాట ఇవ్వకుండా ఈ సినిమా క్రేజ్ ను మరింత పెంచుతున్నాడని టాక్..  

మరింత సమాచారం తెలుసుకోండి: