ఢిల్లీ బ్యూటీ రాకుల్ ప్రీత్ సింగ్ బికినీ అదృష్టం గురించి టాలీవుడ్ లో ఒక ఆశక్తికర కథనం ప్రచారంలో ఉంది. ఈమె 2009 లో మిస్ ఇండియా పోటీలలో పాల్గొన్నప్పుడు ఈమెకు బికినీ రౌండ్ లో అత్యధిక పాయింట్లు వచ్చాయి. ఆ తరువాత మోడల్ గా మారిపోయి నెమ్మదిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీకి ఇప్పుడు వరస పెట్టి విజయాలు వస్తూ ఉండటంతో ఈమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది.  ఈమె నటించిన ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’, ‘లౌక్యం’ సినిమాలతో పాటు నిన్న విడుదలైన ‘కరెంట్ తీగ’ సినిమాలు వరసగా విజయం సాధించడంతో ఈమె టాలీవుడ్ కు హ్యాట్రిక్ హిట్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈమె ఈమూడు సినిమాలలోను బికినీ వేసుకుని నటించి హడావిడి చేయడంతో ఈ బ్యూటీ అదృష్టం వెనుక బికినీ నీడలా వెంటాడుతూనే ఉంది అని రకుల్ పై సెటైర్లు పడుతున్నాయి.  ప్రస్తుతం ఈమె రేంజ్ ఎలా ఉందంటే యంగ్ హీరోలంతా రకుల్ నామ జపమే చేస్తున్నారు. ఆది తో ‘రఫ్’, రామ్‌ తో ‘పండగ చేస్కో’, రవితేజతో ‘కిక్ 2’ సినిమాలు చేస్తున్న రకుల్ పై వస్తున్న వార్తల ప్రకారం నిజంగా పవన్ తో ‘గబ్బర్ సింగ్ 2’ నటించగలిగితే రకుల్ దశ తిరిగి టాప్ హీరోయిన్ అయిపోయినట్లే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: