ఈనెల 30వ తారీఖున హుదూద్ బాధితుల సహాయం కోసం నిర్వహింపబడుతున్న ‘మేము సైతం’ కార్యక్రమాన్ని నడిపించి తమ నాయకత్వ లక్షణాలను చాటుకునే వేదికగా ‘మేము సైతం’ కార్యక్రమాన్ని మలుచు కోవలసిన పవన్, మహేష్ లు ఈ కార్యక్రమం పట్ల అంటిముట్టనట్లుగా నిర్లిప్తంగా ఉండటం టాలీవుడ్ లోని చాలామందిని ఆశ్చర్య పరుస్తోంది. సినిమాల జయాపజాలతో సంబంధం లేకుండా ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ స్టార్స్ ఎవరూ అంటే పవన్, మహేష్ ల పేర్ల తరువాతే ఎవరి పేరైనా వినపడుతుంది  కోలీవుడ్ లో టాప్ స్టార్స్ గా వెలుగొందుతున్న విజయ్, అజిత్, సూర్యా లు ఆ సినిమా రంగానికి సంబంధించి ఎటువంటి సమస్యలు వచ్చినా లేదా కోలీవుడ్ పరిశ్రమ ఏదైనా ఒక భారీ కార్యక్రమాన్ని తలపెట్టినా ముందుండి నడిపిస్తారు అనే పేరుంది. అయితే దీనికి భిన్నంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో జరగని ఒక భారీ కర్యాక్రమంగా ‘మేము సైతం’ నిర్వహింప బడుతుంటే అతి కష్టంగా ఈ కార్యక్రమంలో లైవ్ పెర్ ఫామెన్స్ తో మహేష్ పవన్ లు వేదిక ఎక్కడానికే ఎంతో మొహమాటంగా ఒప్పుకోవడం చూస్తూ ఉంటే భవిష్యత్ లో టాలీవుడ్ సినిమా రంగ పెద్దలుగా ఎదగవలసిన ఈ సూపర్ స్టార్ లు తమకు లభించిన అరుదైన అవకాశాన్ని జారవిడుచుకున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి.  నేటి యువతరం హీరోలకు ఒక రోల్ మోడల్ గా వ్యవహరించవలసిన వీరిద్దరూ కేవలం వీరి సినిమాల విషయాల గురించే కాకుండా టాలీవుడ్ పరిశ్రమ గురించి కూడా పట్టించుకోవలసిన అవసరం ఉంది అంటూ కొందరు విమర్శకులు విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఫంక్షన్స్ కు, ఆర్భాటాలకు దూరంగా ఉండే వీరిద్దరూ భవిష్యత్ లో అయినా మారి టాలీవుడ్ సినిమా రంగానికి రోల్ మోడల్ గా మారగాలరా ? అన్నదే ప్రశ్న..  

మరింత సమాచారం తెలుసుకోండి: