మహేష్ బాబును బ్రాండ్ ఎండార్స్ మెంట్ల విషయంలో టాలీవుడ్ రారాజుగా మారడం వెనుక మహేష్ భార్య నమ్రతకు ముంబాయిలోని ప్రముఖ యాడ్ ఏజన్సీలతో తనకున్న పరిచయం చాల కలిసి వచ్చింది అని చాలామంది అంటూ ఉంటారు. అదేవిధంగా మహేష్ అంగీకరించే సినిమా కథల ఎంపికలో నమ్రత ప్రమేయం ఉంది అనే వార్తలు గతంలో వచ్చినప్పుడు ఆ వార్తలను ఒక ఇంటర్వ్యూలో నమ్రత ఖండించింది.  అయితే ‘ఆగడు’ పరాజయంతో నిరాశకు లోనైన మహేష్ చుట్టూ ఇప్పుడు కవచంలా నమ్రత ఉండటమే కాకుండా భవిష్యత్ లో సినిమాల కథల ఎంపిక విషయంలో మహేష్ ఎటువంటి అజాగ్రత్తతతో కూడిన నిర్ణయం తీసుకోకుండా నమ్రత తన ఇంటికి మహేష్ ను కలవడానికి వచ్చే వారి విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటోంది అని టాక్.  ఫిలింనగర్ లో వినిపిస్తున్న ఒక ఆ శక్తికర వార్త ప్రకారం ఇటీవల ఒక ప్రముఖ నిర్మాత మహేష్ బాబును కలిసి తన సినిమా ప్రపోజల్ పెట్టి స్టోరీ చెప్పి వెళ్లి పోయారట. అయితే ఆ విషయం తరువాత తెలుసుకున్న నమ్రత తన ఇంటి సెక్యూరిటీ వారిపై సీరియస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ముందస్తు సమాచారం లేకుండా ఎవరినీ ఇంటిలోనికి రానీయొద్దని స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చిందట. దీనికి కారణం ఈ మధ్య కాలంలో కొందరు మహేష్ బాబు చుట్టూ చేరి హడావుడి చేయడం ఎక్కువైందని, వారి మూలంగా మహేష్ బాబు డిస్ట్రబ్ అయి సరైన నిర్ణయాలు తీసుకోలేకబోతున్నాడని నమ్రత అభిప్రాయం అనే వార్తలు వస్తున్నాయి. అందువల్లనే ఆమె స్వయంగా రంగంలోకి దిగి మహేష్ బాబు చుట్టూ చేరి భజన చేస్తున్న కొంతమంది భజన బృందాన్ని ఆమె కట్టడి చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ప్రస్తుతం చాలామంది నిర్మాతలు మహేష్ ను కలవడానికి ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రిన్స్ మహేష్ ఇంటికి వెళుతున్నారని టాక్. నమ్రత తీసుకుంటున్న ఈ జాగ్రత్తలతో కనీసం వచ్చే కొత్త సంవత్సరంలో అయినా మహేష్ కు సూపర్ హిట్ వస్తుందేమో చూడాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: