అక్కినేని అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అఖిల్ సినిమా ప్రారంభం కావడం ఇప్పటికే అనేక కారణాలతో ఆలస్యం అవడం అక్కినేని అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. కొంతకాలం ఈ సినిమా కథ, దర్శకుడి గురించి విపరీతంగా ఆలోచించిన నాగార్జున చివరకు దర్శకుడుతో పాటు కథను ఫైనల్ చేసినా ఈ సినిమాకు హీరోయిన్ సమస్య వెంటాడుతూ వచ్చింది. మొదట్లో ఈ సినిమాకు రాశి ఖన్నా హీరోయిన్ గా ఎంపిక చేసారు అనే వార్తలు వచ్చినా ఆమె ఎంపిక పై నాగ్ అంత సుముఖంగా లేదు అనే వార్తలు కూడా వచ్చాయి. దీనితో అఖిల్ హీరోయిన్ హంట్ తిరిగి ప్రారంభమై శ్రీదేవి కుమార్తె జాహ్నవి దగ్గర ఆగిందని ఫిలింనగర్ టాక్.  అఖిల్ నటించబోయేది సోషియో ఫ్యాంటసీ సినిమా కాబట్టి ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ లో నటించిన శ్రీదేవి కుమార్తె జాహ్నవి అఖిల్ మొట్టమొదటి సినిమా హీరోయిన్ అయితే ప్రారంభం నుంచి ఈ సినిమాకు క్రేజ్ తో పాటు బయ్యర్స్ లో మంచి మార్కెట్ పలుకుతుందని నాగ్ ప్లాన్ అని అంటున్నారు. అయితే జాహ్నవి సినిమా ఎంట్రీ విషయంలో ఎటూ తేల్చుకోలేక పోతున్న శ్రీదేవిని స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి ఒప్పించాడు అనే వార్తలు కూడా ఉన్నాయి. ప్రస్తుతుం ఈ సినిమా దర్శకుడు వినాయక్ తల్లి అనారోగ్యంతో వాయిదా పడ్డ ఈ సినిమాను అతి త్వరలో ఎటువంటి హంగామా లేకుండా సైలెంట్ గా ప్రారంభించి అందరికీ షాక్ ఇవ్వాలని ఆలోచిస్తున్నాడట నాగ్.

మరింత సమాచారం తెలుసుకోండి: