పవన్ గోపాలుడు వరుణ్ తేజ్ ముకుందుడు ముందు వెనుకుల అయోమయం టాలీవుడ్ సంక్రాంతి మార్కెట్ ను తీవ్ర అయోమయంలో పడేస్తోంది అనే వార్తలు వస్తున్నాయి. పవన్ వెంకీల ‘గోపాల గోపాల’ విడుదలను అధికారికంగా ఈసినిమా నిర్మాతలలో ఒకరు అయిన సురేష్ బాబు ప్రకటించడంతో గోపలుడిని ఢి కొట్టే సాహసం వరుణ్ తేజ్ ముకుందుడు చేస్తాడా అన్న ఆశక్తి అందరిలోనూ రోజురోజుకీ పెరిగి పోతోంది. ఈ వార్తలకు మరో ట్విస్ట్ ఇస్తూ పవన్ ‘గోపాల గోపాల’ నిర్మాతలను పిలిచి రాబోతున్న సంక్రాంతి తన అన్న కుమారుడు వరుణ్ తేజ్ కు వదిలి జనవరి చివరి వారంలో ‘గోపాల గోపాల’ విడుదల చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేసాడు అని విశ్వసనీయ సమాచారం. అయితే ఈ ఆలోచనకు ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయిన సురేష్ బాబు వ్యతిరేకించడంతో పాటు ఈ సినిమాను చాలా భారీ మొత్తాలకు కొనుక్కున్న బయ్యర్స్ లో వ్యతిరేకత వస్తుంది అని తేల్చడంతో ఈ మెగా వార్ ఏమిటి అని పవన్ మధ పడుతున్నట్లు టాక్  దీనితో పవన్ ప్రోద్బలంతో రంగం లోకి దిగిన పవన్ సన్నిహితుడు ఈ సినిమా నిర్మాతలలో ఒకరు అయిన శరత్ మరార్ రాయబారం ఫలించడంతో ‘ముకుంద’ నిర్మాతలు సంక్రాంతి కంటే ముందుగానే అంటే డిసెంబర్ నెలాఖరున క్రిస్మస్ సమయంలో ‘ముకుంద’ సినిమాను విడుదల చెయ్యాలని డిసైడ్ అయ్యారని వార్తలు వస్తున్నాయి.  అయితే ఇది కేవలం ఒక ఆలోచన మాత్రమే అని ‘ముకుందా’ నిర్మాతలు ఇంకా ఏమి అధికారికంగా ఏమి నిశ్చయించుకోలేదు అనే వార్తలు కూడా ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఈ మెగా వార్ ప్రభావంతో సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేద్దాం అని అనుకున్న చాలామంది నిర్మాతలు తమ సినిమాల విడుదల మరియు మార్కెటింగ్ విషయoలో చాల సమస్యలు ఎదుర్కొంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఏమైనా బాబాయి, అబ్బాయిల రగడ టాలీవుడ్ ను కుదిపెసేలా ఉన్నది అని అంటున్నారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: