అష్టాచమ్మా మూవీతో హీరోగా ఎంట్రి ఇచ్చిన యంగ్ యాక్టర్, నాని. అష్టాచమ్మా తరువాత తను నటించిన మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద మినిమం గ్యారెంటీ అనే బ్రాండ్ రావడంతో నానికి వరుస ఆఫర్స్ వచ్చాయి. అతి తక్కువ సమయంలో నానీ హీరోగా ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే గత కొంత కాలంగా నాని నటించని మూవీలు ఏవీ రిలీజ్ కి నోచుకోలేని పరిస్థితి. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన పైసా మూవీ చాలా సందర్భాల్లో వాయిదా పడుకుంటూ, చివరికీ ఎటువంటి ఎక్స్ పెక్టేషన్స్ లేకుండానే రిలీజ్ అయింది. ఆ తరువాత అదే కోవలోకి వచ్చిన మూవీ జెండాపై కపిరాజు. నాని నటించిన ఈ ‘జెండా పై కపిరాజు’ చిత్రం విడుదల తాజాగా మరోసారి వాయిదా పడింది. ఇటీవల ప్రకటించినట్టుగా ఈ చిత్రం నవంబర్ నెలాఖరులో విడుదల కావడం లేదని సమాచారం బయటకు వచ్చిన తరువాత కూడ, మరోసారి దీని రిలీజ్ కి సంబంధించిన డిస్కషన్స్ జరుగాయి. అయితే అవి కూడ విఫలం కావడంతో ఇప్పుడు ఈ మూవీ డిసెంబర్‌ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. అయితే డిసెంబర్ లోనూ విడుదల కష్టమే అనే విధంగా టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ చిత్రం విడుదల కోసం నాని ఎదురుచూడడం మినహా అతని చేతుల్లో ఏమి లేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ‘శంభో శివ శంభో’ ఫేం సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అమలా పాల్, రాగిణి ద్వివేది కధానాయికలు. కెరీర్ లో తొలిసారిగా నాని ద్విపాత్రాభినయం చేసిన సినిమా ఇది. శరత్ కుమార్ సిబిఐ ఆఫీసర్ పాత్రలో నటించారు. నిర్మాత ఈ మూవీకి సంబంధించిన ఇబ్బందులను తట్టుకొని రిలీజ్ చేయాలంటే మరో రెండు నెలల సమయం పట్టవచ్చంటూ ఫిల్మ్ నగర్ కథనాలు తెలుపుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: