“అత్తారింటికి దారేది” సినిమా బ్లాక్ బస్టర్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ చాల గ్యాప్ తీసుకుని అల్లుఅర్జున్ తో నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమాకు సంబంధించి ఒక ఆశక్తికర కథనం ఫిలింనగర్ లో హడావిడి చేస్తోంది. ‘త్రిశూలం’ అనే టైటిల్ ఈ సినిమాకు నిశ్చయించారు అనే వార్తల వస్తున్న నేపధ్యంతో పాటు ఈ సినిమా కథకు సంబంధించిన ఒక ఆ శక్తికర రూమర్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. వినపడుతున్న వార్తల ప్రకారం త్రివిక్రమ్ ఈసినిమాను అటు ఇటు గా మార్చి బన్నీని మమగారింటికి దారేది అని సెటైర్లు వేసుకునేడట్లుగా చూపించ బోతున్నాడని టాక్. ‘అత్తారింటికి దారేది’ లో పవన్ అత్తను వెతుకుంటూ వస్తే బన్నీ త్రివిక్రమ్ తీస్తున్న సినిమాలో మామను వెతుక్కుంటూ వెళతాడనే వార్తలు వినపడుతున్నాయి. పవన్ అత్తారిల్లు లో ఇద్దరు మరదళ్ళు ఉంటే బన్నీ కొత్త సినిమా కథ కోసం త్రివిక్రమ్ ముగ్గురు మరదళ్ళను పెట్టాడు అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీ నిర్వహించే అల్లుఅర్జున్ ఈ సినిమాలో తన మామయ్యా పాత్రను పోషిస్తున్న కన్నడ హీరో ఉపేంద్రను బన్నీ తన ముగ్గురు మరదళ్ళ సహాయంతో ఎలా దారికి తెచ్చాడు అనేది త్రివిక్రమ్ బన్నీ సినిమా కోసం రాసిన కథ అని అంటున్నారు.  అయితే బయటకు వస్తున్న ఈ కథను విన్నవారు మాత్రం త్రివిక్రమ్ తెగ ఆలోచించి పవన్ ‘అత్తారింటికి దారేది’ సినిమాను బన్నీ కోసం రివర్స్ లో రాసాడు అని అనడమే కాకుండా త్రివిక్రమ్ పెన్నులో ఇంక్ అయిపోయిందా? అంటూ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పై కొందరు వేస్తున్న సెటైర్లు ఆశ్చర్యo కలిగిస్తున్నాయి.  అంతేకాదు అల్లుఅర్జున్ కెరియర్ లో ఏ సినిమాకు పెట్టనంత భారీ బడ్జెట్ ఈ సినిమా పై నిర్మాతల చేత పెట్టిస్తూ బయ్యర్లలో విపరీతమైన క్రేజ్ సృష్టించి బన్నీ సినిమాల స్థాయికి మించి బిజినెస్ ను త్రివిక్రమ్ జరిపిస్తున్నా పవన్ సినిమా కథనుమార్చి రివర్స్ లో రాసిన ఈ సినిమా కథ గురించి వస్తున్న వార్తలు నిజమైతే త్రివిక్రమ్ బన్నీతో చేస్తున్న ఈ త్రిశూల ప్రయోగం మిస్ ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందని కొందరి విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయి రాబోతున్న ఫిబ్రవరి మొదటి వారంలో విడుదలకు సిద్ధం అవుతున్న నేపధ్యంలో త్రివిక్రమ్ చేస్తున్న ఈ రివర్స్ ప్రయోగం ఎంత వరకు బన్నీకి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తుందో చూడాలి !

మరింత సమాచారం తెలుసుకోండి: