దర్శకుడు మారుతికి అల్లు శిరీష్ తో ‘కొత్త జంట’ సినిమా తీసిన తరువాత ఎదో విధంగా అల్లుఅర్జున్, రామ్ చరణ్ లతో సినిమాలు తీయాలని వీరిద్దరి చుట్టూ తిరుగుతూ ఎన్నో కథలు చెప్పాడు మారుతి. అయితే మారుతి కలలు పగటి కలగానే మిగిలిపోయింది.  అనుకోకుండా జరుగుతున్న ‘మేము సైతం’ కార్యక్రమం మారుతి కలను నిజం చేసే అవకాశాన్ని కలిగించింది అనే వార్తలు వస్తున్నాయి. ఎప్పటి నుంచో చరణ్, బన్నీలను ఒకే సినిమాలో ఎదురెదురుగా చూడాలని ముచ్చట పడుతున్న మెగా అభిమానుల కోరికతో పాటు వారిని డైరెక్ట్ చేయాలి అని అనుకున్న మారుతి కోరికను వచ్చే ఆదివారం జరగబోతున్న ‘మేము సైతం’ కార్యక్రమం తీర్చబోతోంది.  అల్లుఅర్జున్, రామ్ చరణ్ లు కలిసి నటిస్తున్న ఒక కామెడీ స్కిట్ ను మారుతి ఆరోజు మెగా అభిమానుల కోసం ప్రజంట్ చేయబోతున్నాడు. లైవ్ టెలికాస్ట్ లో లక్షలాది మంది చూసే ఈ స్కిట్ సూపర్ సక్సస్ అయి,మారుతి కోరికను భవిష్యత్ లో ఈ మెగా హీరోలలో ఎవరైనా తీరిస్తే అది మారుతికి హూదూద్ చేసిన ఉపకారమే అనుకోవాలి...   

మరింత సమాచారం తెలుసుకోండి: