టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రెష్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. వరుస విజయాలతో మంచి జోష్ మీదున్న లక్కీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఆ న్యూస్ ని విన్న రకుల్ ప్రీత్ సింగ్ దాదాపు ఎగిరి గంతేసింది. పవన్ కల్యాణ్ సినిమాలో ఆమెకు ఆఫర్ వచ్చిందని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. 'గబ్బర్ సింగ్ 2' సినిమాలో రెండో హీరోయిన్ గా రకుల్ ని తీసుకునేందుకు చిత్ర యూనిట్ తనకు మెసేజ్ వచ్చింది. అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పవన్ కళ్యాణ్ కి కూడ వివరించింది. ఇప్పటి వరకూ లీడ్ రోల్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్, పవన్ కళ్యాణ్ సరసన సెకండ్ హీరోయిన్ అనే సరికి, ఏ మాత్రం అడ్డుచెప్పకుండా ఓకే అనేసింది. ఇప్పుడు ఈ సెకండ్ హీరోయిన్ రోల్ ని పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేయాల్సి ఉంది. ప్రస్తుతం గోపాల గోపాల షూటింగ్ లో బిజిగా ఉన్న పవన్ కళ్యాణ్, మరి కొద్ది రోజుల్లో రకుల్ ప్రీత్ సింగ్ ప్రొఫైల్ ని చూసి, ఓ నిర్ణయాన్ని తీసుకుంటాడని చిత్ర యూనిట్ నుండి అందిన సమాచారం. ఇప్పటికే ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ ను ప్రధాన కథానాయికగా ఎంపిక చేసిన సంగతి మనకు తెలిసిందే. 'పవర్' ఫేం బాబీ దర్శకత్వం వహించే ఈ చిత్రం షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం, గబ్బర్ సింగ్ 2 ఆఫర్ ని వదులుకోవటానికి ఎంత మాత్రం ఇష్టపడటం లేదు. ప్రతి రోజు రకుల్ ప్రీత్ సింగ్, డైరెక్టర్ బాబీతో టచ్ లో ఉంటుందనే టాక్ ఫిల్మ్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: