మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో ఆ మధ్య వచ్చిన చిత్రం 'దృశ్యం'. ఇది అక్కడ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో ఈ సినిమాపై అన్ని ఇండస్ట్రీల దృష్టి పడింది. టాలీవుడ్ లో ఇటీవలే రీమేక్‌ చేశారు. సురేష్‌ ప్రొడక్షన్‌లో వెంకటేష్‌ హీరోగా అదే టైటిల్‌తో విడుదలైన ఈ చిత్రం ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. సస్పెన్స్ గా సాగే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అలాగే కన్నడంలో కూడా విడుదలై సక్సెస్‌ సాధించింది. ప్రస్తుతం తమిళంలో కమల్‌ హాసన్‌ హీరోగా 'పాపనాశం' అనే పేరుతో రూపొందుతోంది. కమల్ హాసన్ నటిస్తున్న ఈసినిమా షూటింగ్ ని పూర్తి చేసుకొని 2015 జనవరిలో రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే, బాలీవుడ్ లో కూడా ఈ సినిమాను రూపొందించనున్నారని గతంలో వార్తలు హల్ చల్ చేశౄయి.తాజాగా అజయ్ దేవ్ గన్ హీరోగా ఈ చిత్రం రూపొందనుంది. గతంలో అజయ్ దేవగన్, సౌత్ రిమేక్ లో హీరోగా నటించి బ్లాక్ బస్టర్ సక్సెస్ లని సాధించాడు. ఇప్పుడు కూడ దృశ్యం రిమేక్ ని హిందీలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్ గా సోనాక్షి సిన్హా నటించే అవకాశాలు ఉన్నాయని బిటౌన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. బిటౌన్ లో రిమేక్ కాబోతున్న దృశ్యం రిమేక్ పై మరిన్ని విషయాలు మరి కొద్ది రోజుల్లోనే బయటకు రానున్నాయి. అయితే కథలో కొద్ది పాటి మార్పులు చేసి, మూవీని కమర్షియల్ గానూ, ఫ్యామిలీ డ్రామా గానూ తెరకెక్కించటానికి బిటౌన్ సిద్ధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: