చిరంజీవి, నాగార్జునుల మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలిసిన విషయమే. వ్యక్తిగత జీవితాల నుండి బిజినెస్ ల వరకు వీరిద్దరూ ఎన్నో విషయాలలో కలిసి అడుగులు వేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని రామ్ చరణ్ కొనసాగిస్తున్నాడా అని అనిపిస్తుంది. మొన్న ‘మేము సైతం’ కార్యక్రమంలో జరగబోతున్న స్టార్ క్రికెట్ టీమ్ సెలక్షన్స్ కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి చరణ్ అఖిల్ తో కలిసి తన కొత్త ‘రేంజ్ రోవర్’ కారులో కలిసి ఆ కార్యక్రమానికి రావడం హాట్ టాపిక్ గా మారింది. ఈ కంపెనీ లేటెస్ట్ గా విడుదల చేసిన ఆటో బయోగ్రఫీ ఎడిషన్ మొట్టమొదటి కారును చరణ్ కొన్నట్లుగా వార్తలు వస్తున్నాయి.  అత్యంత విలాసవంతమైన ఈ కారు ఖరీదు 3.5 కోట్లు ఉంటుందని టాక్. ఆ మధ్య తన తండ్రికి కోటి పైనే విలువ చేసే కారు గిఫ్టుగా చరణ్ ఇచ్చాడు అన్న వార్తలు తెలిసినవే. మొన్న జరిగిన ‘మేము సైతం’ క్రికెట్ టీమ్ సెలక్షన్ కార్యక్రమానికి చరణ్ ఈ కారును డ్రైవ్ చేసుకుంటూ రావడమే కాకుండా తన పక్క సీట్లో అఖిల్ ని కూర్చో పెట్టుకుని రావడంతో కొందరికి ఆశ్చర్యం కలిగితే చరణ్ కు ఖరీదైన కార్ల పట్లా, ఖరీదైన కుక్కల పట్ల ఉన్న మోజును మరోసారి నిరుపిoచుకున్నాడు అంటూ కామెంట్స్ వినపడ్డాయి. అయితే అఖిల్ చరణ్ తో కలిసి చేసిన ఈ కారు ప్రయాణంలో ఏమి మాట్లాడుకున్నారో అన్నది మాత్రం వారికే తెలియాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: