మిల్కీ బ్యూటీ తమన్నా సెక్యూరిటీ గార్డ్స్ మధ్య రక్షణ వలయంలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తత పరిస్థితులలో తమన్నాను కలవడానికి చాలామంది దర్శకులు నిర్మాతలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నట్లు కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది. తమన్నా ఇంత హడావిడి చేయడానికి ఆమెకు కోలీవుడ్ మీడియా పై వచ్చిన కోపం కారణం అని అంటున్నారు.  ఇక వివరాలలోకి వెళ్ళితే చాన్నాళ్ల తర్వాత తమన్నా ప్రస్తుతం ఒక తమిళ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె పక్క కోలీవుడ్ హీరో ఆర్య నటిస్తున్నాడు. ఈమధ్యనే ఈ సినిమా షూటింగ్ మొదలు అయింది.  అయితే చాలా రోజుల తరువాత తమన్నా చెన్నై వచ్చి ఒక తమిళ సినిమాలో నటిస్తూ ఉండటంతో కోలీవుడ్ మీడియా వర్గాలు ఆమెను షూటింగ్ సమయంలో రోజు కలుస్తూ రకరకాల ప్రశ్నలతో ఆమెను విసిగించడం మొదలు పెట్టారట. మీ ప్రేమ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? మీ పెళ్ళిఎప్పుడు? బాలీవుడ్‌లో ఫ్లాప్‌లకు కారణమేంటి..? ఇలాంటి ప్రశ్నలు కోలీవుడ్ మీడియా వేసి తమన్నాను తెగ విసిగించారట.  ఈ ప్రశ్నలతో విపరీతమైన కోపం తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తాను ఇక మీడియా వారిని కలవను అని ప్రతిజ్ఞ చేయడమే కాకుండా ఈ మీడియా టార్చర్ వల్ల తనకు షూటింగ్ లో ఏకాగ్రత తప్పిపోతోoది అని చెప్పి, తాను ప్రస్తుతం నటిస్తున్న సినిమా నిర్మాతతో చెప్పి తనకు సెక్యూరిటీగా చాలా మంది సెక్యూరిటీ గార్డ్స్ ను ఏర్పాటు చేసుకుని మీడియాకు దొరకకుండా రక్షణ వలయంలో కాలం గడుపుతోంది అంటూ కోలీవుడ్ మీడియా వార్తలు రాస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: