తమిళనాడులో ఖాళీ అయిన కాంగ్రెస్ కు జవసత్వాలు నింపడానికి లేటెస్ట్ గా కాంగ్రెస్ పార్టీలో చేరిన కుష్బూ సూపర్ స్టార్ రజినీకాంత్ ను తన మాటలతో టార్గెట్ చేయడం సంచలనంగా మారింది. ప్రజలకు సేవ చేయాలని ఉంటే వెంటనే రాజకీయాలలోకి రమ్మంటూ కుష్బూ రజినీకాంత్ కు సవాల్ విసిరింది.  కొద్ది రోజులు తనకు రాజకీయాలు సరిపడవు అంటూ మరి కొద్ది రోజులు దేవుడు ఎలా ఆజ్ఞాపిస్తే అలా చేస్తాను అంటూ తాను గందరగోళం పడుతూ ప్రజలను గందరగోళంలో పడేసే ప్రకటనలను మానుకోవాలని కుష్బూ రజినీకాంత్ కు సూచించింది. ఈరోజు ఉదయం చెన్నైలో కుష్బూ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.  అంతేకాదు తనకు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బాగు చేసే భాద్యతను తనకు కాంగ్రెస్ అధిష్టాన వర్గం అప్పగించింది అని చెపుతూ తన శక్తి మేరకు కాంగ్రెస్ కు పునర్వైభవం తీసుకు వచ్చేలా కృషి చేస్తాను అని చెప్పింది కుష్బూ. నిన్న కోలీవుడ్ దర్శకుడు నటుడు అయిన సీమాన్ రజినీకాంత్ కు రాజకీయాలలోకి వచ్చే అర్హత లేదు అని కామెంట్ చేసి ఒకరోజు గడవకుండానే ఈరోజు కుష్బూ రజినీకాంత్ పై ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేయడం బట్టి చూస్తూ ఉంటే రజినీకాంత్ ను దెబ్బతీయడానికి ఏదైనా ఒక వ్యూహాత్మక ఎత్తుగడ తమిళనాడులో జరుగుతోందా అనే అనుమానం రజినీకాంత్ అభిమానులలో ఖచ్చితంగా ఏర్పడుతుంది..   

మరింత సమాచారం తెలుసుకోండి: