టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బిగ్ సెలబ్రిటీస్ పేరు సంపాందించుకు మెగా బ్రదర్ నాగాబాబు, అలాగే గ్లామర్ హీరోయిన్ రోజాలపై లీగల్ కేసు నమోదు అయినట్టుగా సమాచారం తెలుస్తుంది. విషయంలోకి వెళితే నాగబాబు, రోజాపై కరీంనగర్ జిల్లాలో కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ న్యూస్ బుల్లి తెరలో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రముఖ ఛానెల్లో ప్రసారమవుతున్న 'జబర్దస్త్' కామెడి షోపై కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కామెడీ షోలో న్యాయవాదులు, న్యాయమూర్తులని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని అభ్యంతరం వ్యక్తంచేస్తూ హుజూరాబాద్‌కి చెందిన లాయర్ ఎతిపతి అరుణ్ స్థానిక కోర్టులో ఓ పిటిషన్ దాఖలుచేశారు. దీంతో ఈ న్యూస్ బుల్లితెర ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చక్కెర్లు కొడుతుంది. అయితే ఈ పిటిషన్ ని విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆ కామెడీ షో నిర్వాహకులపై కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు షో నిర్వాహకులైన మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్ ఎండి శ్యాంప్రసాద్ రెడ్డి, మేనేజర్ ఏడుకొండలు, డైరెక్టర్ సంజీవ్, సదరు స్కిట్‌లో పార్టిసిపెంట్స్, జడ్జీలు రోజా, నాగబాబు, యాంకర్ అనసూయతోపాటు ఆ ప్రోగ్రామ్‌ని ప్రసారం చేసిన ఛానెల్ చీఫ్ ఎడిటర్, ప్రోగ్రామ్‌ని ప్రమోట్ చేసిన వెబ్‌సైట్‌పై పోలీసులు కేసులు నమోదు చేశారు. తెలుగు ఎంటర్ టైన్మెంట్ ఛానెల్స్ షోలలో నెంబర్ వన్ ప్రోగ్రాం‌గా పాపులారిటీ సంపాదించుకున్న జబర్ధస్త్ టీం, కేసు నుండి బయటపడేందుకు, లాయర్ తో చర్ఛలు జరుపుతున్నట్టుగా టాక్స్ వినిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: