‘ఆగడు’ ఘోర పరాజయంతో టాలీవుడ్ పై ఆశలు వదులుకున్న తమన్నాకు ఒక జ్యోతిష్కుడు ఇచ్చిన ఉంగరం మహిమతో ఏకంగా జూనియర్ ను ఆమె బుట్టలో పడేలా చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం కోలీవుడ్ లో ఆర్యాతో సినిమాను చేస్తున్న తమన్నా చేతికి ఒక ఖరీదైన డిమాండ్ ఉంగరం కనిపించడంతో ఈ ఉంగరం తమన్నా ఎంగేజ్ మెంట్ రింగ్ అంటూ కోలీవుడ్ మీడియా వరస పెట్టి వార్తలు రాయడమే కాకుండా ఆమెను ప్రశ్నలతో వేధించింది.  దీనితో విసికిపోయిన తమన్నా తన చుట్టూ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుని మీడియా కంట పడకుండా తన కోలీవుడ్ సినిమా షూటింగ్ పూర్తి చేస్తోంది. అయితే తమన్నా లేటెస్ట్ డైమoడ్ రింగ్ అసలు కథ బయటకు వచ్చింది. ‘ఆగడు’ పరాజయం తరువాత మిల్కీ బ్యూటి తమన్నా ఒక ప్రముఖ జ్యోతిష్కుడుని తన కెరియర్ గురించి సలహా అడిగిందట. ఆమె బాధ విన్న ఆ జ్యోతిష్కుడు ఒక డైమoడ్ ఉంగరాన్ని పూజలో పెట్టి ఆమెకు ఇచ్చాడట. ఈ ఉంగరం పెట్టుకున్న కొద్దిరోజులకు తమన్నాకు టాలీవుడ్ నుంచి పిలుపులు రావడం మొదలయ్యాయి అని ఆమె భావన. తమన్నా ఈ ఉంగరం పెట్టుకున్న తరువాత మొదటి అదృష్టంగా నాగార్జున కార్తీ కలిసి నటించబోతున్న మల్టీ స్టారర్ లో ఎంపిక అయితే ఆ ఉంగరం మహిమ ఏకంగా జూనియర్ నే ప్రభావితం చేసింది అనే వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం జూనియర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చే సంవత్సరంలో నటించబోయే సినిమాకు హీరోయిన్ గా తమన్నా పేరును ఆలోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాకు జూనియర్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ ను సంప్రదించినా ప్రస్తుతం ఆమె డైరీ వచ్చే సంవత్సరం అంతా ఇంచుమించు డేట్స్ ఫుల్ అయిపోవడంతో సుకుమార్ అడిగిన బల్క్ డేట్స్ ఆమె ఇవ్వలేను అని చెప్పిందట. దీనితో ఈ సినిమాకు రకుల్ ప్రీత్ బదులు తమన్నాను ఎంపిక చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనలలో సుకుమార్, జూనియర్లు ఉన్నారు అని టాక్. మొత్తానికి జ్యోతిష్కుడు ఇచ్చిన డైమండ్ రింగ్ జూనియర్ ను ఆకర్షించింది అనే అనుకోవాలి..  

మరింత సమాచారం తెలుసుకోండి: