పూరి జగన్నాథ్ వారసుడు ఆకాష్ హీరోగా ఈరోజు తన టాలీవుడ్ ఎంట్రీకి శ్రీకారం చుట్టుకున్నాడు. వెరైటీ టైటిల్స్ కు చిరునామాగా ఉండే పూరి తన కొడుకు సినిమాకు ‘ఆంధ్రాపోరి’ అనే టైటిల్ కు ఓకె చేసాడు. రాజ్ మదిరాజు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం ఈ రోజే ప్రారంభం అయింది.  ప్రసాద్ ల్యాబ్ ఎండీ రమేష్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిoచడం హాట్ న్యూస్ గా మారింది. ఉల్కా గుప్త హీరోయిన్ గా చేస్తున్న ఈసినిమా ‘టైం పాస్’ అనే మరాఠీ సినిమాకు రీమేక్. ఇప్పటి వరకూ ‘బుజ్జిగాడు', ‘ధోని' లాంటి సినిమాలలో నటించి మెప్పించిన ఆకాష్ ఈసారి ఏకంగా హీరోగా మారి టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆకాష్ పైనే ఉంది.  జనవరి నుంచి షూటింగ్ జరుపుకుని సమ్మర్ కు ఈ సినిమాను విడుదల చేయాలి అనే ఆలోచనలలో ఈ సినిమా యూనిట్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నిన్న అక్కినేని నాగార్జున వారసుడి సినిమా ప్రారంభం అయితే నేడు పూరి వారసుడి సినిమా ప్రారంభం అవ్వడంతో టాలీవుడ్ లో వారసుల సినిమాల హడావిడి ఏ రేంజ్ కి చేరిపోయిందో అర్ధం అవుతుంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: