‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతో తన దశ తిరిగి పోతుంది అని భ్రమపడ్డ కృష్ణవంశీ కలలు పగటి కలలుగా మిగిలిపోవడంతో తాను తరువాత చేయబోయే సినిమా పై రకరకాల ఆలోచనలతో ఉన్నాడు కృష్ణవంశీ. కాజల్ తో రెండు సినిమాలు చేశాక బోర్ కొట్టింది కాబోలు ఈసారి ఈ క్రియేటివ్ డైరెక్టర్ లుక్స్ తమన్నా పై పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.  ఈమధ్యనే ప్రకాష్ రాజ్ ను ప్రముఖ పాత్ర చేసి కృష్ణవంశీ రాసిన కధతో నిర్మించబోతున్న ఈ లేటెస్ట్ సినిమాలో మరో ముఖ్య పాత్ర కోసం తమన్నాను ఎంపిక చేసినట్లుగా ఫిలింనగర్ లో వార్తలు వస్తున్నాయి. అయితే నటనకు చాల ఆస్కారం ఉన్న ఈ పాత్రకు తమన్నా ఏమి సరిపోతుంది అని కొందరు కృష్ణవంశీకి సూచనలు ఇస్తున్నట్లు సమంచారం.  లేటెస్ట్ గా కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నది ఒక లేడీ ఓరియంటెడ్ మూవీ కాబట్టి ఈ సినిమాలో తమన్నా చేత అద్భుతంగా నటింపచేసి తన సత్తాను తిరిగి చాటాలని కృష్ణవంశీ చాల పట్టుదల మీద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దిల్ రాజ్, ప్రకాష్ రాజ్ లు సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ సినిమా అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే సంవత్సరం ప్రారంభంలో సెట్స్ పైకి వెళుతుంది అని అంటున్నారు. ఏమైనా వినపడుతున్న వార్తలు నిజం అయితే తమన్నా మరో బంపర్ చాన్స్ కొట్టేసిందనే అనుకోవాలి..   

మరింత సమాచారం తెలుసుకోండి: