ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఆహుతి ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నాడు అంటూ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రిక వార్తను ప్రముఖంగా ప్రచురించింది. ప్రస్తుతం ఆహుతి ప్రసాద్ ఒక ప్రవేట్ హాస్పటల్ లో వైద్యం చేయించుకుంటున్నాడని అయితే ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు చాల గోప్యంగా ఉంచారని ఆ పత్రిక కథనం.  అదేవిధంగా ప్రస్తుతం ఆహుతి ప్రసాద్ తన సెల్ కు కూడా అందుబాటులో లేకుండా ఉంటున్నాడని ఆయన సెల్ కు ఫోన్ చేస్తున్న కాల్స్ ను అతని కుమారుడు రిసీవ్ చేసుకుంటూ తన తండ్రి బిజీగా ఉన్నాడని చెపుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయని అ పత్రిక కథనం.  అంతేకాకుండా ఆహుతి ప్రసాద్ మిత్రులు కొంతమంది ఆయన ఇంటికి వెళ్ళి అసలు విషయాన్ని తెలుసుకుందామని ప్రయత్నించినా ప్రసాద్ ఇంటిలో లేరని సమాధానం వస్తోందని టాక్. ఈ పత్రిక ప్రచురించిన వార్త ప్రకారం ఆహుతి ప్రసాద్ కు ప్రస్తుతం కేన్సర్ ట్రీట్ మెంట్ జరుగుతోందని తెలుస్తోంది. నాగార్జున నటించిన మొదటి సినిమా ‘విక్రమ్’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రసాద్ తాను నటించిన ‘ఆహుతి’ సూపర్ హిట్ కావడంతో ఆహుతి ప్రసాద్ గా టాలీవుడ్ లో గుర్తింపు పొందాడు. ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన ప్రసాద్ త్వరగా కోలుకోవాలని ఆశిద్దాం..

మరింత సమాచారం తెలుసుకోండి: