సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న స్టార్ డైరెక్టర్ క్రిష్ణవంశీ. అయితే క్రిష్ణవంశీ తాజాగా తెరకెక్కించిన గోవిందుడు అందరివాడేలే మూవీ బాక్సాపీస్ వద్ద భారీ సక్సెస్ కాకపోయినా, తన ట్రేడ్ మార్క్ ఉన్న కథగా మంచి గుర్తింపే దక్కించుకుంది. దీంతో కృష్ణవంశీ పేరు ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో వినిపిస్తుంది. గతంలో ఫిల్మ్ ఇండస్ట్రీకి వరుస ప్లాపులని ఇచ్చిన కృష్ణవంశీ, ఇక నుండి ఆలోచించి మూవీలను తీయాలని సరైన కథల కోసం వెయిట్ చేస్తున్నాడు. తన అప్ కమింగ్ మూవీని రెగ్యులర్ ఫార్మెట్ లో కాకుండా, ఈసారి కొద్దిగా డిఫ్రెంట్ గా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం మేరకు కృష్ణవంశీ ఈసారి లేడీ ఓరియంటెడ్ కథలకు ఆసక్తి చూపుతున్నాడు. అందుకే ఓ పవర్ ఫుల్ స్టోరిని ఇప్పటికే సెలక్ట్ చేసుకున్నాడంటూ టాక్స్ వినిపిస్తున్నాయి. అయితే తను ఎంచుకున్న కథలో హీరోయిన్ గా తమన్న నటించే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే తాజాగా కృష్ణవంశీ, తమన్నతో మాట్లాడినట్టుగా క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. కృష్ణవంశీ ఎంచుకున్న కథలో అందరూ కొత్త ఆర్టిస్ట్ లుగా కనిపిస్తారు. ఒక్క తమన్న మాత్రమే కీ రోల్ ని పోషిస్తుంది. అందుకు తమన్న, కృష్ణవంశీ మూవీలో నటించేందుకు దాదాపు కోటిన్నర రూపాయలను డిమాండ్ చేసింది. దీంతో కృష్ణవంశీ, తమన్నని తీసుకుందామా? లేదా? అనే ఆలోచనలో పడిపోయాడు. ఒక్క తమన్నని మాత్రమే నమ్ముకుని సినిమా తీస్తే అది ఎంత వరకూ సక్సెస్ అవుతుందనేది కూడ చెప్పలేనిది అంటూ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. కృష్ణవంశీ తమన్నని కాకుండా అనుష్కతో ఏమైన ట్రై చేస్తే బాగుంటుందనేది ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్స్.

మరింత సమాచారం తెలుసుకోండి: