నందమూరి బాలక్రిష్ణ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ లయన్. ఈ మూవీకి సంబంధించిన టైటిల్ వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే లయన్ మూవీ టైటిల్ ని దాదాపు మార్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. ఈమూవీలో నందమూరి బాలక్రిష్ణ సరసన లీడ్ రోల్ లో త్రిష నటిస్తుంది. త్రిష తాజాగా బాలక్రిష్ణ పై కోలీవుడ్ లో సైటైర్ వేసింది. త్రిష చెబుతున్న దాంట్లో నిజం ఉంది కాని, తను చెప్పిన పద్దతి మాత్రం ఏ మాత్రం బాగోలేదని అంటున్నారు. రీసెంట్ ఓ ప్రెవేట్ ఫంక్షన్ కి వెళ్ళిన త్రిష, అక్కడ మీడియా కంటపడకుండా తెగ మేనేజ్ చేసింది. అయితే మీడియా మాత్రం త్రిషని వదలలేదు. తన దగ్గరకు వెళ్ళిన మీడియా, "ఈ మధ్య కాలంలో మేల్ డామినేషన్ కారణంగా మీకు అవకాశాలు తగ్గిపోయాయి అనేది నిజమా?" అని అడిగింది. అందుకు స్పందించిన త్రిష, "అందులో నిజమే ఉంది. కాని నాకు ఇప్పటికీ అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో ఓ మూవీలో చేస్తున్నాను. మరో మూవీకి కాల్షీట్స్ ఇచ్చాను. కాని ఓ సినిమా హిట్ అయితే, హీరోకే ఎక్కువ క్రెడిట్ వెళుతుంది. ఎందుకంటే, సినిమా బిజినెస్ అతని పేరు మీదే జరుగుతుంది. ఆ తర్వాత దర్శకుడి బాధ్యత వుంటుంది. ఇక మా కథానాయికలకు వాటితో ఏమాత్రం సంబంధం వుండదు. అందుకే మాకు ఇక్కడ ఇంపార్టెన్స్ లు తక్కువ. ప్రస్తుతం బాలక్రిష్ణ గారి మూవీలో నటిస్తున్నాను. ఆ మూవీలో ఎంత వరకూ తన పనో, అంత వరకే చూసుకుంటాను. అంతకు మించి బాలయ్య గారితో ఎక్కువ పెట్టుకోను. ఎందుకంటే మూవీకి బలం హీరో తప్పితే, హీరోయిన్ కాదు'' అంటూ తెగేసి చెప్పింది. గతంలో హీరోయిన్ ని గుర్తించడం లేదంటూ పలు ఇంటర్వూలలో చెప్పిన త్రిష, ఇప్పుడు హీరోయిన్స్ ది ఏమి లేదంటూ చెప్పేసరికి, ఈ మాటలు చెబుతున్నది త్రిషనేనా అనే డౌట్ అక్కడి మీడియాకి కలిగిందట.

మరింత సమాచారం తెలుసుకోండి: