మహేష్ ను మాస్ హీరోగా మార్చిన సినిమా ‘ఒక్కడు’ ఆ సినిమా ఘన విజయం తరువాత మహేష్ టాలీవుడ్ ప్రిన్స్ గా మారిపోయాడు. అటువంటి బ్లాక్ బస్టర్ మూవి ‘ఒక్కడు’ హిందీలో ‘తేవర్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. 2015 జనవరి 9న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్ కోసం నిన్న హైదరాబాద్ వచ్చిన అర్జున్ కపూర్ మహేష్ బాబు గురించి కొన్ని ఆ శక్తికర వ్యాఖ్యలు చేసాడు.  తనకు మహేష్ బాబుతో వ్యక్తిగతంగా పరిచయం లేదని కనీసం తాను మహేష్ నటించిన ఒక్కడు సినిమాను కూడా చూడలేదని అయితే ఆ సినిమాలో మహేష్ నటన గురించి ఎందరో గొప్పగా చెపుతూ ఉంటే విన్నాననీ అంటూ మహేష్ ను ఆకాశానికి ఎత్తేశాడు అర్జున్ కపూర్. తన తండ్రి బోనీకపూర్ ఈ సినిమా రీమేక్ ను మొదలు పెట్టినప్పుడు తాను పరిచయం లేకపోయినా మహేష్ కు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు తనను ప్రోత్సహిస్తూ మహేష్ మాట్లాడిన తీరు తనను ఎంతో ఆశ్చర్యాన్ని గురిచేసి ఆనంద పరిచిందని అర్జున్ కపూర్ మహేష్ వ్యక్తిత్వం పై ప్రశంసలు కురిపించాడు. మహేష్ ‘ఒక్కడు’ సినిమాను చార్మినార్ నేపధ్యంలో భారీ సెట్ వేసి తీస్తే తన ‘తేవర్’ సినిమాను తాజ్ మహల్ నేపధ్యంలో నిర్మించామని ఈ హీరో చెపుతున్నాడు.  అయితే తన సినిమాను ప్రిన్స్ మహేష్ బాబు చూసి ఎలా ఉందో చెప్పాలని తన కోరిక, అయితే మహేష్ తన కోరిక తీరుస్తాడో లేదో తనకు తెలియదు అని అంటున్నాడు ఈ యంగ్ హీరో. సోనాక్షి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో శ్రుతిహాసన్ కూడా అర్జున్ కపూర్ తో స్టెప్స్ వేయడంతో ప్రస్తుతం ఈ సినిమా పై బాలీవుడ్ లో మంచి అంచనాలే ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: