తెలుగుసినిమా తెర జక్కన్నరాజమౌళి ఒకసినిమా గురించి పొగిడితే ఆన్యూస్ హాట్ న్యూస్ గా మారడమే కాకుండా రాజమౌళి మెచ్చుకున్న సినిమాను చూసే ప్రేక్షకులు కూడా పెరిగిపోతారు అనేది నిజం. ఇక లేటెస్ట్ గా రాజమౌళి అమీర్ ఖాన్ ‘పికె' సినిమాకు కుడా బ్రాండ్ అంబాసిడర్ గా మారాడు ‘పికె' చిత్రం ఇప్పటి వరకు ఎప్పుడూ రాని ఓ గొప్ప చిత్రం అంటూ రాజమౌళి తన ట్విటర్ లో కామెంట్స్ చేసాడు.  అంతేకాదు ఈ సినిమాలోని కొన్ని వివాదస్పదమైన డైలాగులను తాను పట్టించుకోవడం లేదని కూడా రాజమౌళి కామెంట్స్ చేసాడు. ఈవార్తలు ఇలా ఉండగా ఈ సినిమాకు ఇప్పటివరకు 285 కోట్లు వసూలు చేసిన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా ‘ధూమ్3’ కలెక్షన్స్ ను అధిక మించి 600 కోట్ల మైలురాయిని చేరుతుందని బాలీవుడ్ విశ్లేషకుల అంచనా.  ఒక వైపు ఈ సినిమాలోని కొన్ని డైలాగ్స్ హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయని లక్నోకు చెందిన హిందూ ఫ్రంట్‌ ఫర్‌ జస్టిస్‌ అనే సంస్థ దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన కోర్ట్ ఈ వారంలో ఎటువంటి నిర్ణయం చెపుతుంది అనే విషయంపై అన్ని వర్గాలు ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: