రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తయ్యాయి. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళుతుంది. ఓ రకంగా చెప్పాలంటే రామ్ చరణ్ తేజ్ ఈ సంవత్సరం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ సంవత్సరం రెండు సినిమాలను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకున్నాని, ఫ్యాన్స్ కి అధికారికంగా తెలిపాడు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ లో జరిగిన ఓ ఈవెంట్ లో తన అభిమానులతో మాట్లాడుతూ ‘ఈ సంవత్సరం కూడా రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని’ తెలిడంతో ఫ్యాన్స్ తెగ సంతోషపడ్డారు. గత సంవత్సరంలోనూ రామ్ చరణ్ ఎవడు, గోవిందుడు అందరివాడేలే సినిమాలతో విజయాలను అందుకున్నాడు. ఇదిలా ఉంటే రామ్ చరణ్, శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ‘నా పేరే రాజు’ అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. శ్రీనువైట్ల ఈ పేరుని ఫిక్చ్ చేసే పనిలో ఉన్నాడు. కాని రామ్ చరణ్ మాత్రం నా పేరు రాజు అనే టైటిల్ చాలా మాస్ గానూ, ఓల్డ్ గానూ ఉందంటూ, వెంటనే దానిని మార్చి, మరొక పేరును మార్చాలంటూ శ్రీనువైట్లకి సలహా కూడ ఇచ్చాడంట. దీంతో శ్రీనువైట్ల టీం మరో సరికొత్త పేరుని చరణ్ మూవీ కోసం వెతుకుంది. శ్రీనువైట్ల కాంబినేషన్ అనంతరం, రామ్ చరణ్ సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. శ్రీను వైట్ల సినిమా పూర్తి కాగానే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. ఈ రెండు సినిమాలను ఈ సంవత్సరంలోనే రిలీజ్ చెయ్యడానికి చరణ్ ప్లాన్ చేసాడు. మొత్తానికి చరణ్ కి టైటిల్ నచ్ఛకపోవడంతో ఫ్యాన్స్ నుండి కూడ మంచి టైటిల్స్ ని సేకరించే పనిలో ఉంది శ్రీనువైట్ల టీం. 

మరింత సమాచారం తెలుసుకోండి: