కళ్యాణ్ రామ్ 'పటాస్' చిత్రంతో హిట్ కొట్టి నందమూరి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు. శుక్రవారం విడుదలైన పటాస్ కు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా కళ్యాణ్‌రామ్ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలుస్తోందని అంటున్నారు. ఇదిలా ఉంటే పూరి జగన్నాథ్ కన్ను కళ్యాణ్‌పై పడిందని అంటున్నారు. టెంపర్ తరువాత మహేష్ సినిమా గ్యారంటీ లేదు. వుండొచ్చు లేకపోవచ్చు అని టాక్. మెగా క్యాంప్ కు మళ్లీ వెళ్లినా కూడా ఇంకా టైమ్ పడుతుంది. అందుకే ప్రొడ్యూసర్ కమ్ హీరో అయిన కళ్యాణ్ రామ్ తో సినిమా చేయాలని, అదే విషయం అడియో ఫంక్షన్ లో కలిసినపుడు కళ్యాణ్ కు చెప్పాడని టాలీవుడ్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. అందుకు కళ్యాణ్ రామ్ కూడ పాజిటివ్ గా సమాధానం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే పూరీ జగన్నాధ్ దగ్గర ప్రస్తుతం పెద్ద హీరోల డేట్స్ ఏవీ లేవు. కాని ప్రభాష్ తో పూరీ జగన్నాధ్ ఓ మూవీని తీసే ఉద్ధేశంలో ఉన్నాడని తెలుస్తుంది. ప్రభాస్ కూడ బాహుబలి మూవీ షూటింగ్స్ కి కొంత కాలం గ్యాప్ రావడంతో, ఈ సమయంలో ఒక కమర్షియల్ ఫార్ములా మూవీని తీయాలని నిర్ణయించుకున్నాడు. గతంలోనూ బాహుబలి మూవీ స్టార్ట్ కాకముందు, చిన్న మూవీగా అనుకొని మిర్చి మూవీలో నటించాడు. అది కాస్త బాక్సాపీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు కూడ అదే తరహాలో పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో నటించటానికి తను సిద్ధంగా ఉన్నాడంటూ టాక్స్ వినిపిస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ కి కళ్యాణ్ రామ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని అంటున్నారు. కొద్ది రోజులు ఆగితే ఈ ప్రాజెక్టుపై స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: