‘రచ్చ’ సినిమా తరువాత టాప్ డైరెక్టరుగా అయిపోతాడు అని అందరు అనుకున్న సంపత్ నంది పవన్ కళ్యాణ్ వద్ద ‘గబ్బర్ సింగ్ 2’ కు చిక్కుకు పోవడంతో రెండు సవత్సరాలు ఖాళీగా గడిపాడు. చివరకు పవన్ పై పెట్టుకున్న ఆశలు ఆవిరి అయిపోవడంతో తిరిగి ఎదో విధంగా రవితేజాను ఒప్పించి ‘బెంగాల్ టైగర్’ గా మారుస్తున్నాడు. పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ కోసం రాసిన కథనే కొద్దిగా మార్పులు చేసి ఈ ‘బెంగాల్ టైగర్’ గా మార్చాడు అనే మాటలు వినిపిస్తున్నాయి.

అయితే యాదృచ్చికo అనుకోవాలి, క్రితం సంవత్సరం ఫిబ్రవరి 21న ‘గబ్బర్ సింగ్ 2’ కు కొబ్బరికాయ కొట్టి ముహూర్తం పెట్టిన రోజు శుక్రు వారం అయితే అదే శుక్రు వారం ఈరోజు ‘బెంగాల్ టైగర్’ కు ముహూర్తంగా మారింది. ఎన్నో సమస్యలను ఎదుర్కున్న ‘గబ్బర్ సింగ్ -2’ ముహూర్తం తరువాత నేడు ‘బెంగాల్ టైగర్’ పట్టాలు ఎక్కుతూ ఉండటంతో తిరిగి అదే శుక్రవారం సంపత్ నందిని వెంటాడటం యాదృచ్చికమే అయినా సంపత్ నందిని ఫ్రైడే సెంటిమెంట్ భయ పెడుతోంది అని టాక్.

రవితేజ సరసన తమన్నా, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమా ప్రారంభోత్సవం ఈరోజు రామా నాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య జరుపుకోనుంది. ఈ సినిమాతో అయినా సంపత్ నంది దశతిరిగి మళ్ళీ తన ప్రాభవాన్ని అందుకుంటాడని అనుకుందాం.

తమన్నా, రాశి ఖన్నాలు మొట్టమొదటి సారిగా రావితేజాతో రొమాన్స్ చేయబోతున్న ఈ సినిమాలో రవితేజాతో జోడీగా వీరిద్దరూ ఎంతవరకు నప్పుతారు అనే ప్రచారం జరుగుతున్నా ఒక పవర్ ఫుల్ టైటిల్ తో ప్రారంభం అవుతున్న ఈ సినిమా ప్రారంభం నుండే హాట్ టాపిక్ గా మారింది..

మరింత సమాచారం తెలుసుకోండి: