మెగాస్టార్ చిరంజీవి వారసులుగా ఇప్పటి వరకు పవన్ కళ్యాన్, రాంచరణ్, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ,వరుణ్ తేజ లాంటి హీరోలు వచ్చారు..ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో వీరి హవ్వా కొనసాగుతుంది.. అయితే హీరోయిన్ గా మాత్రం ఎవరూ ఇండస్ట్రీలోకి రాలేదు.. వాస్తవానికి చిరంజీవి కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.. వారు  సినిమా రంగానికి దూరంగానే ఉన్నారు..తాజాగా నాగబాబు కూతురు నిహారిక మాత్రం సినిమాలపై బాగా ఇంట్రెస్ట్ ఉండటంతో సినామలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది.

ఇప్పటికే ‘ఢీ జూనియర్స్ ’  ప్రోగ్రామ్ లో యాంకర్ గా వస్తుంది. మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురైన ఈ ముద్దుగుమ్మ త్వరలో ‘ఒక మనసు' సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం కాబోతోంది. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నాగ శౌర్య హీరో.  అయితే ఈ విషయంపై రాంచరణ్ ఓ సంచలన వ్యాఖ్య చేశారు.. వాస్తవానికి నిహారిక చిత్ర రంగంలోకి వస్తున్న విషయం తనకు తెలియదని ఈ మద్య పేపర్లో చూశానని అయితే బాబాయికి ఇష్టమైతే తమకు ఎలాంటి అభ్యంతరం ఉండబోదని చెప్పారు. 


కుటుంబంతో నిహారిక


నిహారిక సినిమా రంగ ప్రవేశం చేస్తున్నట్లు మెగాస్టార్ కుటుంబానికి తెలియదా..? అన్న అనుమానాలకు తావిస్తుంది. అయితే నిహారిక ఎంట్రీ కూడా మెగా ఫ్యామిలీ హీరోల లాంచింగ్ భారీ స్థాయిలో మెగా అభిమానుల మద్య జరగడం ఆనవాయితీ. తాజాగా నిహారిక ను అందరికీ పరిచయం చేయడానికి మెగా ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారని, ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీ నుండి చిరంజీవితో పాటు ఇతర స్టార్స్ అంతా హాజరవుతారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి: