తెలుగు ఇండస్ట్రీలో మకుటం లేని మహరాజులా వెలిగిపోయిన మాస్ హీరో మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్స్, ఫైట్స్, కామెడీకి కొత్త భాష్యంచెప్పిన ఆయన ప్రజల్లో మెగాస్టార్ చిరంజీవిగా మిగిలిపోయారు..ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ..ఎన్నో స్వచ్చంద సంస్థలు నెలకొల్పి ప్రజోపకార్యాలు కూడా చేశారు. తర్వాత రాజకీయాల్లోకి వెళ్లి సొంతగా ‘ప్రజారాజ్యం’ పార్టీ స్థాపించి కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ లో విలీనం చేశారు. తర్వాత కేంద్ర మంత్రి హోదాలో సేవలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఆ మద్య రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంలో తనయుడు రాంచరణ్ తో ఓ పాటలో కనిపించాడు.. తాజాగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా వస్తున్న ‘బ్రూస్ లీ ’ చిత్రంలో నాలుగు నిమిషాల పాటు కనిపించనున్నాడు. దీంతో ఈ సినిమాపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది..దాదాపు చిరంజీవి పది సంవత్సరాల తర్వాత ముఖానికి రంగు పూసుకొని సినిమాల్లో కనిపించడం మెగా అభిమానుల్లోనే కాక మెగా కుటుంబంలో కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు.

మగధీర చిత్రంలో చిరంజీవి, రాంచరణ్


బ్రూస్ లీ చిత్రం రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ సినిమా బెనిఫిట్ షో ఎప్పుడు వస్తుందా మామయ్యను మళ్లీ తెరపై ఎప్పుుడు చూస్తామా అని ఎంతో ఉత్సాహంగా ఉన్నారట. చిరంజీవిని అభిమానించే వాళ్లలో అల్లు అర్జున్ ముందు ఉంటారు..చాలా ఏళ్ల తర్వాత చిరంజీవి గారు స్క్రీన్ మీద కనిపించబోతున్నారు. ఆయన్ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అని ఉంది. ఆగలేకపోతున్నా... అనే అర్దం వచ్చేలా అల్లు అర్జున్ తాజాగా ట్వీట్ చేస్తూ బ్రూస్ లీ చిత్రం యూనిట్ కు శుభాకాంక్షలు తెలియచేసారు. 

అల్లు అర్జున్ ట్విట్ : 

మరింత సమాచారం తెలుసుకోండి: