అందాల సదాకు మళ్లీ నిరాశ ఎదురయ్యింది. చాలా రోజుల తరువాత సదా నటించిన మైత్రీ సినిమా గత శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవదీప్ హీరోగా నటించిన ఈ సినిమాకు సూర్య రాజు దర్శకత్వం వహించారు. రాజేష్ కుమార్ నిర్మించారు. తక్కువ ధియేటర్లలో విడుదలైన మైత్రీ సినిమాకు సాధారణ కలెక్షన్లు కూడా రాలేదని, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యిందనే వార్తలు వస్తున్నాయి. పోస్టర్స్ లో సదా అందాలనే ఆయుధంగా ఉపయోగించారు. సదా ప్రధానంగా కనిపించేటట్లు ప్రచారం చేశారు. అయినా పెద్దగా ఉపయోగం లేదు. అయితే, బి,సి సెంటర్ల నుంచి కొద్దిగా అయినా కలెక్షన్లు వస్తాయిని చిత్ర యూనిట్ ఆశపడుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: