మొన్న జరిగిన సుకుమార్ నిర్మిస్తున్న ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో జరిగిన ఒక సంఘటన గురించి టాలీవుడ్ వర్గాలు చాల లోతుగామాట్లడుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫంక్షన్ కు అల్లుఅర్జున్ ముఖ్య అతిధిగా వచ్చిన నేపధ్యంలో బన్నీ అభిమానులమంటూ కొందరు చేసిన హడావిడి చాలా మందిని ఆశ్చర్య పరుస్తోంది. ఎప్పుడు లేని విధంగా ఈ ఆడియో వేడుకను అల్లుఅర్జున్ హైజాక్ చేసాడు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
‘కుమారి 21 ఎఫ్’ ఆడియో ఫంక్షన్ జరుగుతున్న ఆడిటోరియంలో అల్లుఅర్జున్ అభిమానులం అంటూ కొందరు కుర్రాళ్ళు తెగ సందడి చేసారు. ఈహడావిడితో ఈఫంక్షన్ కు వచ్చిన చాలా మంది అతిధులకు మాట్లాడే వీల్లేకుండా పోయింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరొక ఆశ్చర్యకర విషయం ఏమిటంటే ఈసినిమా హీరో రాజ్ తరుణ్ కూడ పరాయి వాడిగా తనకు ఒక నిమిషం మాట్లాడే అవకాశమివ్వమని హడావిడి చేస్తున్న అల్లుఅర్జున్ అభిమానులను పదేపదే వేడుకోవాల్సి రావడం షాకింగ్ గా మారింది.
పవన్కళ్యాణ్ ఫాన్స్ మాదిరిగా అల్లు అర్జున్ ఫాన్స్ ఒక్కసారిగా రెచ్చిపోయిన సంఘటన ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు ఎందుకు జరిగింది అని కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు. దీనికి కారణం అల్లుఅర్జున్ ఇప్పటివవరకు ఎన్నో ఫంక్షన్స్ కు అతిధిగా వచ్చినా ఇలా బన్నీ అభిమానుల మంటూ ఒక ప్రత్యేకమైన వర్గం హడావిడి చేసిన సందర్భాలు లేవు మెగా ఫాన్స్ అండదండలతో పైకెదిగిన అల్లు అర్జున్కి ఇలా వీరాభిమానులు ఎర్పడ్డారా ? లేదంటే తనకీ అభిమానులున్నారని చూపడానికి అల్లు అర్జున్ ఈ వేడుకని ఇలా వాడుకున్నడా అనే మాటలు వినిపిస్తున్నాయి.
ఒకవైపు ‘బ్రూస్ లీ’ పరాజయంతో రామ్ చరణ్ క్రేజ్ డౌన్ అవుతున్న నేపధ్యంలో ఇలా మీడియా దృష్టి లో పడటానికి అల్లుఅర్జున్ అభిమానుల పేరిట జరిగిన రగడ వెనుక ఏదైనా వ్యూహాత్మక ఎత్తుగడ ఉందా అనే గుసగుసలు ఫిలింనగర్ లో హడావిడి చేస్తున్నాయి..