ఢిల్లీ బ్యూటీ రకుల్ ప్రీత్ అతి తక్కువ కాలంలో టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా ఎదిగి పోయింది. ఈమధ్య ఒక ప్రముఖ నిర్మాత తన కొడుకును హీరోగా పెట్టి తీయబోతున్న సినిమాకు రకుల్ కోసం సంప్రదిస్తే ఏకంగా ఆమె 2 కోట్ల పైన పారితోషికం అడిగింది అని ఫిలింనగర్ టాక్. ఆ రేంజ్ కి వెళ్ళి పోయిన రకుల్ మెగా కాంపౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చి ‘బ్రూస్ లీ’ లో చరణ్ తో నటించి ప్రస్తుతం అల్లుఅర్జున్ తో ‘సరైనోడు’ సినిమాలో నటిస్తోంది. 

ఇది చాలదు అన్నట్లుగా త్వరలో ప్రారంభం కాబోతున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ సినిమాకు కూడ రకుల్ హీరోయిన్ గా ఎంపిక అయింది అన్న వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా కాంపౌండ్ ను అంతా రకుల్ చుట్టేస్తూ ఉన్నా రకుల్ దృష్టి మాత్రం పవన్ కళ్యాణ్ పై పెట్టింది అన్న వార్తలు వస్తున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం పవన్ కళ్యాణ్ నటించబోయే భవిష్యత్ సినిమాలలో ఏదో ఒక్క సినిమాలో అయినా హీరోయిన్ చాన్స్ కొట్టేయాలని రకుల్ చాల గట్టి పధకాలే రచిస్తోంది అని ఫిలింనగర్ టాక్.  

దీనికోసం పవన్ కళ్యాణ్ కు చెందిన మేనేజర్స్ తో పర్శనల్ టచ్ లో ఉంటూ ఎప్పటికప్పుడు పవన్ ప్రాజెక్టుల గురించి తెలుసుకుంటోందట. అంతేకాదు పవన్ నటించే తదుపరి చిత్రంలో ఎట్టి పరిస్దితుల్లో తన పాత్రను ఖరారు చేసుకోవాలని రకుల్ ఆరాటపడుతోంది అని టాక్. రకుల్ తో నటించడానికి పవన్ కూడా ఆసక్తి చూపిస్తున్నాడని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. అయితే పవన్ సినిమాల విషయంలో స్వయంగా పవన్ కే క్లారిటీ లేని నేపధ్యంలో ఎన్ని వ్యూహాత్మక ఎత్తుగడలు వేసినా పవన్ ను బుట్టలో పెట్టడం ఎంత కష్టమైన పనో కొత్తగా వచ్చిన రకుల్ ప్రీత్ కు అవగాహన లేదు అని అనిపిస్తోంది. 

ఈమధ్య కాలంలో రకుల్ నటించిన ‘కిక్ 2’, ‘బ్రూస్ లీ’ లాంటి భారీ సినిమాలు వరస పరాజయాలు చవిచూడటంతో ప్రస్తుతం ఆమె జూనియర్ తో నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా విషయంలో ఏమైనా తేడా జరిగితే రకుల్ ప్రీత్ కెరియర్ అనుకోని కష్టాలలోకి వెళ్ళి పోతుందని టాలీవుడ్ విశ్లేషకులు అంటున్నారు. ఇంతకీ టాలీవుడ్ ఎంపరర్ పవన్ కళ్యాణ్ మనసులో రకుల్ ప్రీత్ కు స్థానం ఉందో లేదో చూడాలి..  



మరింత సమాచారం తెలుసుకోండి: