పవర్ స్టార్ పవన్ కళ్యాన్ పై ప్రిన్స్ మహేష్ బాబు ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడంట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుంటే, చాలా సంవత్సరాల తరువాత మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ నటిస్తున్న అప్ కమింగ్ మూవీలు...కొద్ది రోజుల గ్యాప్ తోనే రిలీజ్ అవుతున్నాయి. ఇలా జరిగితే వీరిద్దరి మూవీలకి అది ప్రమాధమే.


మీడియాలో, ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న కథనాలను మహేష్ సైతం వింటున్నాడంట. బ్రహ్మోత్సవం మూవీకి పోటీగా పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్ధార్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అవుతుందని తెలుసుకున్నాడు. వెంటనే ఇలా జరిగితే వచ్చే నష్టనివారణ చర్యల్ని ముందుగానే అడ్డుకట్ట వేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.


పవన్ మూవీని ఒక నెల రోజులు ముందుగాని, నెల రోజులు తరువాత రిలీజ్ చేసుకోవాల్సిందిగా ఆ చిత్ర నిర్మాతలో మహేష్ మాట్లాడనున్నాడు. పెద్ద హీరోలు కాబట్టి, భారీగా పెట్టుబడిన నిర్మాతలతో పాటు ఇతర బిజినెస్ వ్యవహారాలు ఆధారపడి ఉంటాయి. అందుకే ఎవ్వరూ, ఎవ్వరికి పోటీ కాకూడదనే ప్రయత్నాలను మహేష్ చేస్తున్నాడంట.


ఇక పవన్ కళ్యాణ్ పై మహేష్ చెప్పిన మాటల ప్రకారం, గబ్బర్ సింగ్ కి సీక్వెల్ గా వస్తున్న మూవీ సర్ధార్ కాబట్టి, ఫ్యాన్స్ లో అంచనాలు భారీగానే ఉంటాయి. అందుకే సర్ధార్, బ్రహ్మోత్సవం రెండూ పోటీ పడకుండా జాగ్రత్తపడాలి అని చిత్ర నిర్మాతలో చెప్పుకొచ్చాడంట.



మరింత సమాచారం తెలుసుకోండి: