తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి వారుసులుగా ఒక్క హీరో ఇంట్రడ్యూస్ అవుతున్నారు.  పవన్ కళ్యాన్, అల్లు అర్జున్, రాంచరణ్ హీరోలుగా మంచి ఫామ్ లో ఉన్నారు.. ఈ మద్య కాలంలో చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్, నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ లు హీరోలు గా ఎంట్రీ ఇచ్చారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చే హీరోలపై చాలా అంచనాలు ఉంటాయి..అలాంటి అంచనాలకు తగ్గట్టు గానే ఇద్దరు హీరోలు మంచి నటన, డ్యాన్స్, ఫైట్స్ తో మెగా అభిమానులను ఆకర్షిస్తున్నారు.

వరుణ్ తేజ్ విషయానికి వస్తే ‘ముకుంద’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. క్రిష్ దర్శకత్వంలో వచ్చిన ‘కంచె’ సినిమా విజయంతో మెగా హీరో వరుణ్ తేజ్ సంతోషంగా ఉన్నాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లోఫర్’ సినిమాలో నటిస్తున్నాడు వరుణ్..ఈ మద్య సినిమా టీజచ్ ఒకటి రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ చాలా రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తున్నాడు. డ్యాన్స్, ఫైట్స్ తో చాలా బాగా ఆకట్టుకోబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు. ట్విట్టర్ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు వరుణ్ సమాధానాలిచ్చాడు.

కంచె చిత్రంలో వరుణ్ తేజ్


ఈ సందర్భంగా మెగా అభిమానులకు షాకింగ్ న్యూస్ ఇచ్చాడు వరుణ్. మెగా ఫ్యామిలీలో మీకు నచ్చిన డ్యాన్సర్ ఎవరు అనే ప్రశ్నకు   మా పెదనాన్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత అంత క్రేజ్ సంపాదించుకున్న అన్నయ్య రామ్ చరణే  తెలిపాడు. ఇక ఇండస్ట్రీలో బాగా నచ్చిన మెచ్చిన హీరో ఎవరూ అన్న ప్రశ్నకు ప్రభాస్ అనే సమాధానంతో ప్రభాస్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ మద్య విడుదలైన ‘బాహుబలి’ చిత్రంలో లుకింగ్, యాక్టింగ్ సూపర్బ్ అని మెచ్చుకున్నాడు. అంతే కాదు తెలుగు ఇండస్ట్రీలోనే కాదు ప్రపంచ స్థాయిలో సత్తా చాటుకున్నాడు అంటూ ప్రభాస్ అభిమానులు షాక్ ఇచ్చాడు వరుణ్ సందేష్. 



మరింత సమాచారం తెలుసుకోండి: