మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రతీయేటా ఓ డైరీని విడుదల చేస్తుంది. వచ్చే ఏడాది కోసం ఓ కొత్త డైరీని ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆవిష్కరించారు. తొలి ప్రతిని సూపర్ స్టార్ క్రుష్ణకు అందించారు. ఈ కార్యక్రమంలో నటులు క్రుష్ణం రాజు, మురళీ మోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ ‘ మాకి సొంతం భవనం ఉండాలి. అక్కడ ఎప్పటికప్పుడు సినీ పరిశ్రమ వారంతా సరదాగా కలుసుకుంటుండాలన్నది నా కల. అంతేకాదు, పేద కళాకారులకు న్యాయం జరగాలి. పేదల కళాకారులను ఆదుకునేందుకు నటులూ సాంకేతిక నిపుణులూ విరివిగా విరాళాలు ఇవ్వాలి’ అని కోరారు. ఈ సందర్భంగా క్రుష్ణ కూడా మాట్లాడారు. ‘పరిశ్రమకు చెందిన ప్రముఖులందరూ వారివారి జన్మదినం నాటికి ఎన్నేళ్లు నిండితే అన్ని వేలు విరాళం ఇవ్వాలి’ అని కోరారు. ఆ పని త్వరలో మేం చేస్తాం అంటూ విజయనిర్మల, క్రుష్ణం రాజు ప్రకటించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: