రామ్ చరణ్ కోసం ప్రభాస్ వేసిన వ్యూహాత్మక ఎత్తుగడ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ప్రభాస్ చరణ్ లమధ్య పెద్ద ఘాడ స్నేహం లేకపోయినా ప్రభాస్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. ప్రభాస్ తో ‘మిర్చి’ సినిమాను తీసిన నిర్మాతలు పేరుకు ప్రభాస్ స్నేహితులే అయినా ఆ నిర్మాణ సంస్థ తీసుకునే అన్ని అన్ని నిర్ణయాలలోను ప్రభాస్ సలహా సంప్రదింపులు చాల కీలకంగా ఉంటాయి అన్న వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. 

‘మిర్చి’ తరువాత ‘రన్ రాజా రన్’, ‘జిల్’, ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలు తీసి హిట్స్ కొట్టిన ఈ యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రభాస్ తో తీయాలి అనుకున్న ఒక వెరైటీ కథను ప్రభాస్ సలహాతో రామ్ చరణ్ తో నిర్మించడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు టాక్. ఒక యువ రచయిత చెప్పిన కథ ప్రభాస్ కు బాగా నచ్చడంతో ప్రభాస్ ఈ కథను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తీయిస్తున్నాడు అని తెలుస్తోంది.

‘జిల్’ సినిమాకు దర్శకత్వం వహించిన రాధాకృష్ణ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తాడని వార్తలు వస్తున్నాయి. ఈకథకు సంబంధించిన వివరాలు బాగా నచ్చడంతో చరణ్ తన అంగీకారాన్ని అమెరికా నుండే తెలియచేసాడు అని ఫిలింనగర్ టాక్. వచ్చే నెల మధ్య నుండి ప్రారంభం కాబోతున్న చరణ్ ‘ధని ఒరువన్’ తెలుగు రీమేక్ వీలైనంత త్వరలో పూర్తి చేసి ఆ తరువాత వెనువెంటనే ఈ సినిమా షూటింగ్ చరణ్ ప్రారంభిస్తాడు అని అంటున్నారు.

అయితే కొత్తగా ప్రారంభమైన చరణ్ ప్రభాస్ ల స్నేహం అందరికీ ఆశ్చర్యo కలిగించడమే కాకుండా ఈ మైత్రి వెనుక ఎటువంటి వ్యూహాత్మక ఎత్తుగడలు ఉన్నాయి అన్న విషయం పై ఫిలింనగర్ లో రకరకాల విశ్లేషణలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: