వెంకటేష్ సమస్యను నయనతార చాలతెలివిగా క్యాష్ చేసుకుంది అన్న వార్తలు వస్తున్నాయి. సీనియర్ హీరోలకు సమస్యగా మారిన హీరోయిన్స్ ఎంపిక నయన తారకు కలిసి వచ్చిన అదృష్టంగా మారింది. ‘గోపాల గోపాల’ సినిమా తర్వాత  వెంకటేష్ ఎన్నో కథలు విని చివరకు ఓకె చెప్పిన మారుతి సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించడానికి నయనతార ఈసినిమా దర్శక నిర్మాతలకు చుక్కలు చూపించింది అన్న వార్తలు వస్తున్నాయి. 

వెంకీతో హీరోయిన్ గా ఈ ప్రాజెక్ట్ లో నటించడానికి నయనతారకు కోటిన్నర పారితోషికం ఇస్తేకాని ఆమె డేట్స్ దొరక లేదని టాక్. దీనికి తోడు సినిమా షూటింగ్ సమయంలో ఆమెకు సహాయకులుగా వచ్చే మిగతా సిబ్బంది ఖర్చులు ఆమె విలాసవంతమైన హోటల్ ఖర్చులు అన్నీ కలుపుకుంటే ఒక్క నయనతార విషయంలోనే దరిదాపు 2 కోట్ల ఖర్చు అవుతుందని టాక్. 

ప్రస్తుత పరిస్థుతులలో వెంకటేష్ వయస్సు రీత్యా మరొక హీరోయిన్ నప్పదు అన్న అభిప్రాయంతో ఇంత భారీ ఖర్చుకు ఈసినిమా నిర్మాతలు ఓకె చెప్పారు అన్న వార్తలు వస్తున్నాయి. డిసెంబర్ 16న ఈ సినిమాను  లాంఛనంగా ప్రారంభించి జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ కు వెళ్తారు అని తెలుస్తోంది. ఇప్పటి వరకు తన సినిమాల్లో కామెడీకి పెద్దపీట వేసిన మారుతి ఈ సినిమానిలో కూడ కామెడీ డోస్ ను ఎక్కువగానే పెడుతున్నాడని టాక్. 

ఈ మూవీలో వెంకీ ఓ కామెడీ పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడట. ఇప్పటి వరకు వెంకటేష్ పోలీస్ పాత్రలలో చాల సినిమాలు చేసినా కామెడీ టచ్ తో ఉండే పోలీస్ పాత్రను మొట్టమొదటిసారి చేస్తూ ఉండటంతో ఈసినిమా విజయం పై చాల అంచనాలు పెట్టుకున్నాడు వెంకటేష్. మరి ఈసినిమాలో మారుతి చేసే మ్యాజిక్ వెంకటేష్ కు ఎటువంటి హిట్ ను ఇస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: