‘బాహుబలి’ సినిమా కోసం దాదాపు మూడు సంవత్సరాల విలువైన కాలాన్ని త్యాగం చేయడమే కాకుండా తన పెళ్లిని కూడ త్యాగం చేసుకున్న ప్రభాస్ కు ‘బాహుబలి’ ఘన విజయం సాధించినా ఆ సినిమాకు సంబంధించి ప్రభాస్ కు రావలిసినంత గుర్తింపు రాలేదు అనే భావన ప్రభాస్ వీరాభిమానులలో ఉంది. ఈ అభిప్రాయాలను నిజo చేస్తూ ప్రభాస్ కు ఈ సినిమాకు సంబంధించిన అవార్డ్స్ లో ఒక అనుకోని షాక్ తగిలింది. 

దీనికి కారణం ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా దగ్గుబాటి తొలి అవార్డు అందుకోబోతున్నాడు. దక్షిణ భారత సినిమా రంగంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ‘ఏసియావిజన్ మూవీ అవార్డ్స్- 2015’ లకు రానా ఎంపికయ్యాడు అన్న వార్తలువస్తున్నాయి.  టాలీవుడ్ సినిమాలకు సంబంధించి ‘పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును రానా దక్కించుకున్నాడు. 

డిసెంబర్ 2న దుబాయ్ లో జరిగే వేడుకలో రానా ఈ అవార్డును అందుకోబోతున్నాడు. ఏసియావిజన్ మూవీ అవార్డ్స్ కార్యక్రమం గత 10 సంవత్సరాలుగా జరుగుతోంది.  ఇది 10వ  సంవత్సరం కార్యక్రం కావడంతో చాలా ఘనంగా ఈ కార్య క్రమాన్ని నిర్వహించ బోతున్నారు. దాదాపు 620 కోట్ల కల్లెక్టన్స్ రాబట్టి తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేసిన ‘బాహుబలి’ సినిమా వల్ల రాజమౌళికి రానాకు వచ్చినంత గుర్తిపు ప్రభాస్ కు రాలేదు అన్న విశ్లేషకుల అభిప్రాయనికి ఈ లేటెస్ట్ న్యూస్ ఉదాహరణ అనుకోవచ్చు. 

ఈ విషయాలను దృష్టిలో పెట్టుకునే కాబోలు రాజమౌళి ‘బాహుబలి 2’ లో ప్రభాస్ హీరోయిజమ్ బాగా ఎలివేట్ చేయబోతున్నారట. ఏది ఎలా ఉన్నా ఈ అవార్డు రానాను వరించడం ప్రభాస్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: