తెలుగు ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు వారసులు గా  మంచు విష్ణు, మంచు మనోజ్ లు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇద్దరు అన్నదమ్ములు బిగ్గెస్టు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న హీరోలే.. ఆ మద్య శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ‘ఢీ’ సినిమా మంచి విజయం సాధించింది తర్వాత దేనికైనా రెడీ సినిమా కూడా మంచి సక్సెస్ సాధించినా మంచు విష్ణుకి మాత్రం స్టార్ ఇమేజ్ రాలేదు. ఆ మద్య డైనమైట్ చిత్రం అపజయం కావడంతో మంచి విజయం కోసం కసిగా ఉన్న విష్ణు మరోసారి కామెడీ ఓరియెంటెడ్ సినిమానే నమ్ముకుంటున్నట్లు తెలుస్తుంది.

తాజాగా ‘సరదా’ టైటిల్ సినిమాతో ముందుకు రాబోతున్నాడు..అయితే ఈ సినిమా లో ఇద్దరు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడట. అయితే దీనికోసం మేయిన్ హీరోయిన్ గా అమలాపాల్ ని హీరోయిన్ గా అడిగారట అయితే  ఈ అమ్మడు మాత్రం తనకు రెమ్యూనరేషన్ కోటి అడగడంతో షాక్ తిన్న విష్ణు చిత్ర యూనిట్ వెంటనే నిర్ణయం మార్చుకున్నారట. అమలాపాల్ ని మెయిన్ లీడ్ లో కాకుండా సెకండ్ హీరోయిన్ గా తీసుకోనున్నట్లు టాక్.  అయితే ఈ విషయంపై దర్శకులు కార్తిరెడ్డి మాత్రం అవన్నీ రూమర్స్ అని వాస్తవానికి గతంలో అమలాపాల్ ని కలిసి అడిగిన మాట వాస్తవమే అయినా అప్పుడు ఆమె కన్ఫర్మేషన్ ఇవ్వలేదని అందుకోసమే వేరే హీరోయిన్ తీసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాట్లు తెలిపారు.

మంచు విష్ణు,అమలాపాల్, సొనారిక


ఇకపోతే అమలను అడిగింది సెకండ్ హీరోయిన్ పాత్ర కోసం కాదని.. అది ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే కీలకమైన రోల్ అని చెప్పారు కార్తీక్ రెడ్డి. కాకపోతే ఆ పాత్ర మాత్రం సినిమాలో చాలా కీలకమైన పాత్ర అని అందుకే మంచి గుర్తింపు ఉన్న హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుపారు. ఇకపోతే అమలాపాల్ గతంలో ఇద్దరు అమ్మాయిలు, జెండాపై కపిరాజు సినిమాల్లో నటించిన అవి అంత పెద్ద హిట్ సినిమాలు కావు మరి అలాంటపుడు కోటి రూపాలు ఎలా డిమాండ్ చేస్తుంది అన్ని విషయం చాలా మందిని ఆశ్చర్య పరిచింది. అయితే అవన్నీ ఒట్టి రూమర్లే అయి ఉంటాయని మరి కొంత మంది అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: