గత మూడు సంవత్సరాలుగా పరాజయాలతో బాధ పడుతున్న నానీకి ఈ సంవత్సరం కలిసి రావడమే కాకుండా అతడు నటించిన ‘భలే భలే మగాడివోయ్’ ఈ సంవత్సరపు చిన్న సినిమాలలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే నాని జోష్ ఇక్కడితో ఆగిపోకుండా ఏకంగా మహేష్ రాజమౌళిలతో పోటీపడే స్థాయికి ఎదిగిపోవడం ఇప్పుడు సంచలనంగా మారింది.

‘బాహుబలి’ తో రాజమౌళి సృష్టించిన సంచలనాలు ‘శ్రీమంతుడు’ తో మహేష్ అందుకున్న రికార్డులను బ్రేక్ చేయడం ప్రస్తుతం ఎవరికీ సాధ్యం కాని పనే అయినా నాని నటించిన సినిమాలు మహేష్ రాజమౌళీల సినిమాలతో పోటీ పడుతున్నాయి. త్వరలో జరగబోతున్న ప్రతిష్టాత్మక ఐఐఎఫ్ ఏ అవార్డులకు నామినేట్ అయిన మూవీస్ లో టాలీవుడ్ టాప్ మూవీస్ ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’ తో పాటు నాని నటించిన ‘భలేభలే మగాడివోయ్’, ‘ఎవడే సుబ్రమణ్యం’ చిత్రాలు బెస్ట్ పిక్చర్ రేసులో పోటీ పడటం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. 

ఈ ప్యానల్ కు నామినేట్ అయిన 5 సినిమాలలో రెండు నాని నటించినవే కావడం షాకింగ్ న్యూస్. వీటితో పాటు చిన్న సినిమాగా వచ్చిన ‘పాఠశాల’ ఉత్తమ చిత్రం విభాగంలో పోటీ పడుతోంది. అయితే ఈ అవార్డులు న్యాయనిర్ణేతల నిర్ణయంతో పాటుగా ప్రేక్షకుల ఓటింగ్ పై ఆధారపడతాయి కాబట్టి తీవ్ర పోటీ ‘శ్రీమంతుడు’, ‘బాహుబలి’ మధ్య ఉంటుంది అనడంలో సందేహం లేదు. 

ఈ వార్తలు ఇలా ఉండగా ఇప్పుడు ఐఐఎఫ్ ఏ కి సంబంధించిన తెలుగు సెగ్మెంట్ అవార్డుల ఫంక్షన్ ని అల్లు శిరీష్ హోస్ట్ చేయబోతున్నాడు. ఈ ఈ వెంట్ ను పూర్తి ఎంటర్ టెయిన్ మెంట్ తో తన వ్యాఖ్యానంతో తీర్చి దిద్దుతానని అల్లు శిరీష్ చెపుతున్నాడు. నాని ఈ అవార్డుల పోటీలో మహేష్ కి, రాజమౌళికి ఏమైనా అనుకోని షాక్ లు ఇస్తాడా అన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది..



మరింత సమాచారం తెలుసుకోండి: