నాగార్జున తనయుడు అఖిల్ కు వరస పెట్టి షాక్ లపై షాక్ లు తగులుతున్నాయి. ‘అఖిల్’ నిరాశ నుండి బయట పడటానికి గోవాలో రోజులు గడుపుతున్న ఈ అక్కినేని వారి అబ్బాయికి మరో దిమ్మతిరిగే షాక్ తగిలింది. మొదటి వారంలోనే కలెక్షన్స్ ఘోరంగా పడిపోయిన ‘అఖిల్’ ను ఈసినిమా డిస్ట్రిబ్యూటర్లు కేవలం పరువు కోసం చాల భారంగా ధియేటర్లలో ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఈపరిస్థుతులలో అఖిల్ కు మొన్న విడుదలైన ‘కుమారి 21 ఎఫ్’ ఒక విచిత్రమైన షాక్ ఇచ్చింది అనే వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యకరంగా ఉన్న ఈ వార్తల వివరాలలోకి వెళితే కొన్ని షాకింగ్ న్యూస్ లు కనిపిస్తాయి. విజయవాడలోని ఒక ప్రముఖ మల్టీ ఫ్లక్స్ లో ‘కుమారి 21 ఎఫ్’ సినిమా ప్రదర్శిస్తున్న ధియేటర్ లో ఎదో ఒక టెక్నికల్ సమస్య వచ్చిందని టాక్. 

ఆ సమస్య రాగానే ‘కుమారి 21 ఎఫ్’ ధియేటర్ లో ఉన్న ప్రేక్షకులను నిరాశ పరచకుండా ఆ ధియేటర్ యాజమాన్యం ఒక షాకింగ్ నిర్ణయం తీసుకుందని టాక్. ‘కుమారి 21 ఎఫ్’ సినిమాకు వచ్చిన ప్రేక్షకులను అదే మల్టీ ఫ్లేక్స్ లో మరో స్క్రీన్ లో ప్రదర్శింప బడుతున్న ‘అఖిల్’ సినిమాను ఆపేసి ‘కుమారి 21 ఎఫ్’ ప్రేక్షకులను ‘అఖిల్’ ధియేటర్ లో కూర్చో పెట్టి షో వేసారట. 

అయితే అదే షోకు ఆ ధియేటర్ లో ‘అఖిల్’ సినిమా టిక్కెట్లను కొనుక్కున్న వారికి సారీ చెప్పి వారి టిక్కెట్ డబ్బు వాపస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు రావడంతో ఆ ధియేటర్ కు వచ్చిన చాలామంది ‘కుమారి’ వల్ల ‘అఖిల్’ అవమాన పడ్డాడు అంటూ సెటైర్లు వేసుకున్నట్లు టాక్.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: