ప్రస్తుతం టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా వినిపిస్తున్న మూవీ సరైనోడు. తాజాగా ఈ మూవీకి సంబంధించినఓ విషయంపై అల్లుఅర్జున్ ఏమంత సంతృప్తిగా లేడని అంటున్నారు. దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే, స్టైలిష్ స్టార్అల్లు అర్జున్ ప్రస్తుతం చేస్తున్న మాస్ ఎంటర్టైనర్ ‘సరైనోడు. ఒక్క మాస్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఆడియన్స్ కిసైతం ప్రాముఖ్యత ఇస్తూ, బోయపాటి శ్రీను ఈ సినిమాకి తెరకెక్కిస్తున్నాడు. 


తాజాగా ఓ భారీ షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఈ చిత్ర టీం, కీలక సన్నివేశాల కోసం రాజమండ్రిలో షూటింగ్ ని జరుపుకుంటుంది. ఇదిలా ఉంటే మరోవైపుఈ మూవీకి సంబంధించిన మ్యూజిక్ కంపోజిషన్ చాలా స్పీడుగా జరుగుతుంది. ఈ మూవీకి తమన్ మ్యూజిక్అందిస్తున్నాడు. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చింది. దేవిశ్రీప్రసాద్ డేట్స్ బన్నీ మూవీకి చేసేంత రిలాక్స్ టైంఉన్నప్పటికీ, దేవీశ్రీని కాదని థమన్ ని తీసకున్నాడు డైరెక్టర్ బోయపాటి. 


అయితే బన్నీ మూవీకి ప్రతీసారి మ్యూజిక్అనేది హైలెట్ వస్తుంది. బోయపాటితో తో మొదటి సినిమా, అందులోనూ యాక్షన్ డైరెక్టర్ కావటంతో... ఈ మూవీఅవుట్ పుట్ ఎలా వస్తుందో అంటూ ఒకింత భయంగా ఉన్నడంట అల్లుఅర్జున్. ఇక తనని ఎంతగానో అభిమానించే దేవీశ్రీసైతం పక్కన లేకపోవటంతో...థమన్ మ్యూజిక్ పైనే హోప్స్ పెట్టుకున్నాడంట. గతంలో బోయపాటికి, దేవీశ్రీల మధ్యలెజెండ్ మూవీ విషయంలో బాహాటంగానే గొడవలు జరిగాయి. అందుకే దేవిశ్రీకి బోయపాటి నో చెప్పేశాడు.

 

అయితే తనజాగ్రత్తలలో ఉన్న అల్లుఅర్జున్, థమన్ ని ప్రత్యేకంగా కలిసి....రేసుగుర్రం మూవీ మ్యూజిక్ కంటే అధిరేలా ఉండాలి..మీ మీదే పూర్తి నమ్మకం పెట్టుకున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం థమన్ రామజోగయ్య శాస్త్రితో కలిసి సరైనోడుకోసం సాంగ్స్ ని కంపోజ్ చేసే పనిలో ఉన్నాడు. మొత్తంగా అల్లుఅర్జున్, బోయపాటి డైరెక్షన్ ని నమ్మినప్పటికీ... ఒకింతభయంగానే ఉన్నాడంట. అందుకే కనీసం మ్యూజిక్ అయినా ప్లస్ అవుతుందని థమన్ తో క్లోజ్ గా మూవ్అవుతున్నాడు అల్లుఅర్జున్. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రకుల్ ప్రీత్ సింగ్, కేథరిన్ లు హీరోయిన్స్ గానటిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: