గత కొంత కాలంగా కృష్ణవంశీ ఇబ్బందుల్లో ఉన్నాడని తనే స్వయంగా గోవిందుడు అందరివాడే మూవీ రిలీజ్ టైంలో చెప్పుకొచ్చాడు. రామ్ చరణ్ మంచి హ్యుమన్ బీయింగ్ కలిగిన వ్యక్తి కావటంతో...కృష్ణవంశీ లాంటి దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడని స్యయంగా కృష్ణవంశీ చెప్పుకొచ్చాడు. టాప్ డైరెక్టర్ గా కృష్ణవంశీ ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలను ఇండస్ట్రీకి అందించాడు. అలాంటి డైరెక్టర్ నోటి వెంటఇలాంటి మాటలు రావటం అనేది, నిజంగా అందరికి ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి.


రొటీన్ కి భిన్నంగా ఉండే కథలని మాత్రమే కృష్ణవంశీ తెరకెక్కించి, బాక్సాపీస్ వద్ద హిట్ చేయగలడు. ఆ విధంగావచ్చిన గులాబి, సింధూరం, అంతఃపురం, ఖడ్గం, మురారి లాంటి సినిమాలు టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలుగా నిలిచాయి. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాతరువాత, కృష్ణవంశీ మరో కథకి రెడీ అవుతున్నాడు. ఓ హర్రర్ కథాంశంతో తన తదుపరి సినిమా స్క్రిప్ట్ ని సిద్దం చేస్తున్నాడు. ఈ హర్రర్ సినిమా కథకి ‘రుద్రాక్ష’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.


అయితేగోవిందుడు అందరివాడే మూవీ మంచి మూవీ అయినప్పటికీ, బాక్సాపీస్ పరంగా ఆశించినంత కలెక్షన్స్ ని సాధించలేదు. ఆ తరవాత కృష్ణవంశీకి బడా నిర్మాతలు వచ్చి సినిమాలు తీసిపెట్టాలనిఅడిగిన సందర్భాలు కూడ లేవు. మరి ఈ రుద్రక్ష మూవీ కృష్ణవంశీకి ఎలా వచ్చింది? ఇక్కడే తెరవెనుక జరిగిన కథ అందరిని ఆశ్ఛర్యపరుస్తుంది. కృష్ణవంశీ, ప్రకాష్ రాజ్ ఇద్దరూ మంచి స్నేహితులు.ఇగో కారణాలతో ఇద్దరూ విడిపోయారు. చాలా సంవత్సరాల తరువాత రామ్ చరణ్  కారణంగా, చిరంజీవి సలహాతో వీరిద్దరూ కలిసి గోవిందుడు అందరివాడే మూవీలో కలిసి పనిచేశారు.


ఇక టాలెంట్ఉన్న స్నేహితుడు కృష్ణవంశీ ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకొని, ప్రకాష్ రాజ్ నిర్మాతగా మారి రుద్రక్షా మూవీని తెరకెక్కిస్తున్నాడంట. అయితే ప్రకాష్ రాజ్, ఈ మూవీలో దిల్ రాజుని భాగస్వామ్యంచేశాడు. దీంతో ఈ ప్రాజెక్ట్ అంతా దిలా రాజు బ్యానర్ మీద తెరకెక్కుతంది. కానీ తెరవెనుక మాత్రం ప్రకాష్ రాజ్ ఫండింగ్ ఉందనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఓపెన్ సీక్రెట్స్.


ఇక ఈ మూవీకి సంబంధించినతాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో 5 మంచి హీరోలు నటించే అవకాశం ఉంది. ఇటీవలే కృష్ణవంశీ ఫైనల్ నేరేషన్ ని దిల్ రాజుకి వినిపించగా, దిల్ రాజు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు సమాచారం.త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన టెక్నికల్, స్టార్ కాస్టింగ్ వివరాలు బయటకు రానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: