‘బాహుబలి 2’ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసి వచ్చేనెల నుంచి ఈసినిమా షూటింగ్ కు రంగం సిద్ధం చేస్తున్న రాజమౌళిని ఒక విషయం తీవ్రంగా భయపెడుతోంది అన్నవార్తలు వస్తున్నాయి. దీనికికారణం ప్రస్తుతం సినిమాలకు సంబంధించిన విషయాలను రహస్యంగా ఉంచడంలో ఏర్పడుతున్న సమస్యలు అని టాక్. ప్రస్తుతం నడుస్తున్న స్పీడ్ యుగంలో టెక్నాలజీతో ఏదైనా చేయవచ్చు అన్నది నిజం. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన విషయాలు విపరీతంగా లీక్ అయి పోవడంతో ఆ సినిమాలోని ట్విస్టులు ముందే బయట పడిపోవడంతో ఆ సినిమా బిజినెస్ పై తీవ్ర ప్రభావాన్ని చూపెడుతోంది. 

లేటెస్ట్ గా కోలీవుడ్ లో విడుదలైన అజిత్ ‘వేదాలం’ సినిమాను విడుదల కాకుండానే ఇంటర్నెట్ లీక్ అయిన సందర్భం తెలిసిందే. ఇదే సమస్య గతంలో ‘బాహుబలి’ సినిమాకు కూడ ఏర్పడినా రాజమౌళి చాల తెలివిగా ఆ లీక్ లను కంట్రోల్ చేయగలిగాడు. అయితే ప్రస్తుతం ‘బాహుబలి 2’ షూటింగ్ కు కౌంట్ డౌన్ మొదలు అవుతూ ఉండటంతో ఈ లీక్ ల విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ‘బాహుబలి-2’  షూటింగ్ కు చాల గట్టి సెక్యూరిటీ ఏర్పాటు చేయబోతున్నాడు అని టాక్. 

సినిమా యూనిట్ కు సంబంధించిన వారే కాకుండా ఈసినిమాలో నటిస్తున్న నటీనటులు కూడ ఈసినిమా షూటింగ్ స్పాట్ కు సెల్ ఫోన్లు, పెన్ డ్రైవ్ లు తీసుకురాకూడదని గట్టి వార్నింగ్ పెట్టినట్లు టాక్. అంతేకాదు సినిమాకు సంబంధించి ఏ చిన్న సమాచారాన్ని కూడా బయటకు చెప్పకూడదని ముందే చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ పాస్ చేసాడట జక్కన్న. 

‘బాహుబలి 2’ స్టోరీ డిస్కషన్ టైమ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే విషయాన్ని కొంత మందికి రాజమౌళి వివరించి చెప్పడంతో వాళ్ళను కూడ కట్టడి చేస్తూ ఈవిషయాలను ఎక్కడా లీక్ చేయకూడదని ఒకవేళ ఈ విషయాలు లీక్ అయితే వారినే టార్గెట్ చేస్తానని రాజమౌళి అన్నట్లు టాక్. కీలకమైన ఈవిషయం బయటపడితే ‘బాహుబలి 2’ పై ఆ శక్తి పోతుందని రాజమౌళి భయం. అయితే ఈ లీక్ ల వ్యవహారాన్ని రాజమౌళి ఎంత వరకు కట్టడి చేయగలుగుతాడు అన్న విషయం పై రకరకాల మాటలు వినిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: