తెలుగు చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తూ వచ్చిన సినిమా..రాజమౌళి రెండేళ్లు కష్టపడి తీసిని చిత్రం బాహుబలి. ఈ సినిమా కు తెలుగులో ఇప్పటి వరకు ఎవరూ ఖర్చు పెట్టని రీతిలో దాదాపు రెండు వందల కోట్లు ఖర్చు చేశారు. అందుకు తగ్గ ప్రతి ఫలం కూడా వారికి వచ్చింది ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అద్భుతాలు సృష్టించి దాదాపు 600 కోట్లు వసూళ్లు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో ఇప్పటివరకు ఎవరికీ రాని గుర్తింపు నటీ,నటులకు వచ్చింది.

భారతీయ మేటి చిత్రాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా విమర్శకుల నుంచి ప్రసంసలు పొందింది..అంతే కాదు బాహుబలి సినిమాలో భల్లాలదేవుడుగా మెప్పించిన రానా దగ్గుబాటి తొలి అవార్డు అందుకోబోతున్నాడు. సౌతిండియాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఏసియావిజన్ మూవీ అవార్డ్స్-2015 లకు రానా ఎంపికయ్యాడు. తెలుగు విభాగంలో పెర్ఫార్మెర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును రానా దక్కించుకున్నారు.  అయితే  ‘బాహబలి’ చిత్రం తనకు నచ్చలేదని సంచలన కామెంట్ చేశారు ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్.

సాహసం శ్వాసగా సాగిపో చిత్రంలో నాగచైతన్య


 ప్రస్తుతం గౌతమ్ మీనన్ అక్కినేని నాగచైతన్య హీరోగా ''సాహసం శ్వాసగా సాగిపో '' చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. అయితే తనకు టెలివిజన్ సిరీస్ లో వచ్చిన ''గేం ఆఫ్ త్రోన్స్ '' మాత్రం నాకు బాగా నచ్చిందని అమెరికన్ ఫాంటసీ మూవీ ని పొగుడుతున్నాడు గౌతమ్.  ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానులు గౌతమ్ పై ఆగ్రహం వ్యక్తం చేసాడం ఖాయం అంటున్నారు. ఏది ఏమైనా అంత పెద్ద సినిమా మనోడికి ఎందుకు నచ్చలేదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు..ఐనా ఎవి టేస్ట్ వారికి ఉంటుంది కదా..!


మరింత సమాచారం తెలుసుకోండి: