స్టార్ డైరెక్టర్ రాజమౌళి, బాహుబలి మూవీ తరవాత ఇండియన్ బాక్సాపీస్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇండియన్ బాక్సాపీస్ డైరెక్టర్ అంటే, బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ గుర్తించదగ్గ డైరెక్టర్ అని అర్ధం. ఇదిలా ఉంటే, తాజాగా బాలీవుడ్ లో ఓ క్రేజీ మూవీకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో భారీ హిస్టారికల్ మూవీ బాజీరావు మస్తానీ. 17వ శతాబ్ధపు మరాఠ సామ్రాజ్యాధినేత బాజీరావు చరిత్ర ఆధారంగా ఈ సినిమాని హై ఎక్స్ పెక్టేషన్స్ తో తెరకెక్కిస్తున్నారు.


ఈ మూవీకి సంబంధించిన ప్రతి విషయంలో హైప్ క్రియేట్ అవుతూ వస్తుంది. ఇక కాస్టింగ్ విషయానికి వస్తే,  ఓటమి ఎరగని మరాఠా యోధుడు బాజీరావు పాత్రలో రణవీర్ సింగ్ నటిస్తుండగా.. ఆయన భార్య పాత్ర కోసం మస్తానీగా దీపిక, కాశీబాయిగా ప్రియాంక నటించారు. సరిగ్గా ఈ స్టార్ కాస్టింగే మూవీకి హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి. గతంలో రిలీజ్ అయిన ఈ మూవీ టీజర్, అలాగే సాంగ్స్‌ తో అందరినీ మెప్పించింది. ఇక తాజాగా థియేట్రికల్‌ ట్రైలర్ ని రిలీజ్ చేసింది.


ఈ ట్రైలర్ నిడివి దాదాపు 3.45 నిమిషాలు ఉంది. ట్రైలర్ చూసిన తరవాత బాజీరావు మస్తానీ మూవీపై అంచనాలు పెరిగిపోయాయి. ఇక రాజమౌళి సైతం ఈ ట్రైలర్ కి ఎంతో ఇంప్రెస్ అయ్యాడంట. ట్రైలర్ గొప్పగా ఉందంటూ చెప్పుకొచ్చాడు. ఈ మూవీ నుండి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటూ రాజమౌళి చెప్పటం విశేషంగా మారింది.


ఇక సినిమాలోని హైలెట్స్ విషయానికి వస్తే, రణవీర్ సింగ్, దీపిక సన్నివేశాలు ఆకట్టుకోనున్నాయి. మరో యువతితో తన భర్తకు సంబంధం ఉందని బాధపడే కాశీబాయిగా ప్రియాంక.. బాజీరావును వీడలేని మస్తానీగా దీపిక పడే విరహవేదన సన్నివేశాలు ఈ మూవీకి రక్తి కట్టించనున్నాయి. మొత్తంగా ఈ మూవీ డిసెంబర్-18న విడుదల కానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: