తెలుగు రాష్ట్రాల్లో మెగాస్టార్ చిరంజీవి తెరపై కనిపిస్తే సంబరాలు చేసుకునే అభిమానులు చాలా మంది ఉన్నారు.  ఆయనకు ఉన్నమాస్ ఫాలోయింగ్ ఇప్పటి వరకు ఏ హీరోకి రాలేదు. గతంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అంత గొప్ప పేరు సంపాదించిన హీరో ఒక్క చిరంజీవి. అయితే రాజకీయరంగ ప్రవేశం చేసిన తర్వాత ఆయన సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. ఆ మద్య రాంచరణ్ చిత్రం ‘మగధీర’ చిత్రంలో ఒక్క డ్యాన్స్ సీన్లో మాత్రం కనిపించి వెళ్లిపోయాడు. ఇక రాజకీయ రంగానికి కాస్త దూరంగా ఉంటూ ఇప్పుడు తన 150 వ చిత్రంపై దృష్టి పెట్టారు చిరంజీవి.

మొదట్లో పూరీ జగన్నాథ్ తో ‘ఆటోజానీ’ సినిమా తీస్తున్నట్లు  ఈ సినిమా రాంచరణ్ నిర్మించనున్నట్లు ఆ తెగ వార్తలు వచ్చాయి. కానీ అది క్యాన్సల్ కావడంతో మాస్ డైరెక్టర్ వివివినాయక్ దర్శకత్వంలో తమిళంలో వచ్చిన ‘కత్తి’ రిమేక్ తీయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కానీ మొన్నామద్య వచ్చిన ‘అఖిల్’ అపజయంతో చిరంజీవి మళ్లీ డైలమాలో పడ్డట్లు తెలిసింది. దీంతో వివివినాయక్ ని కూడా పక్కకు పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పుడు హిట్ సినిమాల దర్శకుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చిరు 150వ సినిమాను డైరెక్ట్ చేసే చాన్స్ కోట్టేశాడని ఫిల్మనగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి


ఇప్పటికే త్రివిక్రమ్ చిరుకు కథ కూడా వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. ముందుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరంజీవి 150వ సినిమా ఉంటుందని భావించారు.గత రెండేళ్లుగా చిరంజీవి 150వ చిత్రం గురించి వార్తలు వస్తున్నాయి తప్ప అవేవి కార్యరూపం మాత్రం దాల్చడం లేదు . వినాయక్ ,పూరి జగన్నాద్ ల పేర్ల తర్వాత ఇప్పుడు త్రివిక్రమ్ పేరు తెరమీదకు వచ్చింది . ప్రస్తుతం త్రివిక్రమ్ నితిన్ - సమంత లకు  ''అ ...... ఆ '' సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అది పూర్తయ్యాక చరణ్ తో కాని చిరంజీవి తో కానీ సినిమా ఉండొచ్చు అని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: