బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ భారతదేశంలో అసహనం పెరిగిపోతోంది అంటూ కామెంట్ చేయడమే కాకుండా రానున్న రోజులలో తాము ఇండియా నుంచి వెళ్ళి పోవలసి వస్తుందేమో అని తన భార్య కిరణ్ రావ్ తన వద్ద తరుచూ ఆందోళన చెందుతోందని సంచలన వ్యాఖ్యలు చేసాడు. ప్రస్తుతం ఈమాటలు మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న రామ్ నాథ్ గోయెంకా జర్నలిజం అవార్డు ఫంక్షన్ లో అతిధిగా పాల్గొన్న అమీర్ ఖాన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసాడు. 

గత కొద్ది నెలలుగా భారతదేశంలో ఏర్పడుతున్న పరిస్థుతులు తమలో తీవ్ర అబధ్రతా భావాన్ని పెంచుతోందని దీనివల్లనే తాము దేశం నుంచి వెళ్ళిపోవాలా ? అనే దురదృష్టకరమైన ఆలోచన తన భార్యకు కలిగిందని అంటూ తమ పిల్లల గురించి భయపడటమే కాకుండా భవిష్యత్ లో తమ చుట్టూ ఉండే పరిస్థుతులు ఎలా మారిపోతాయో తెలియక తనకు టెన్షన్ తో పాటు నిరాశ పెరిగిపోతోంది అని సంచలన వ్యాఖ్యలు చేసాడు అమీర్.

అంతేకాదు అమీర్ ఖాన్ నేటి రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తూ మనం ఎన్నుకున్న నాయకులు మనలను పరిపాలించడం మానేసి ప్రజలకు అసహనాన్ని అబధ్రతా భావాన్ని కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో ఈ దేశంలోని మేధావులు, కళాకారులు తమకు ప్రభుత్వాలు ఇచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చి వేస్తున్నారని అటువంటి వారికి తన మద్ధతు ఉంది అంటూ కామెంట్స్ చేసాడు అమీర్ ఖాన్. 

‘అమాయకులను చంపేవాడు ముస్లిం’ కాదు అంటూ కామెంట్స్ చేయడమే కాకుండా అతడు అల్లా సిద్దాంతాలను పాటించే నిజమైన ముస్లింగా తాను అనుకోవడం లేదు అని అమీర్ మాట్లాడిన మాటలు వెనుక ఎన్నో అర్ధాలు దాగి ఉన్నాయి. ఏ విషయం పై అయినా స్పష్టంగా మాట్లాడే అమీర్ ఖాన్ నేటి రాజకీయ వేత్తలను టార్గెట్ చేయడం నేటి మీడియా హాట్ టాపిక్..



మరింత సమాచారం తెలుసుకోండి: