తమిళనాట పెను సంచలనాలు సృష్టిస్తున్న అజిత్ చిత్రం ‘వేదలం’. విడుదలైన వారానికి 50 కోట్లు కలెక్షన్లు సాధించి రికార్డుల మోత మోగించింది. అంతే కాదు ఫుల్ మాస్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ చిత్రంపై తెలుగు అగ్ర హీరోలు ముచ్చట పడ్డారు. అంతే కాదు ప్రత్యేకంగా ఆ సినిమా వేయించుకొని మరీ చూశారు ఇంతకీ ఎవరా హీరోలు అంటారా..ఒకరు మెగాస్టార్ చిరంజీవి మరొకరు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఈ చిత్రం ఈ ఇద్దరు హీరోలకు మాస్ ఇమేజ్ తేగల చిత్రం. అందుకే అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు సమాచారం.కానీ ఎన్టీఆర్ మాత్రం ఈ వార్తలు ఖండిస్తున్నారు.

సుకుమార్ తో తీస్తున్న చిత్రం నాన్నకు ప్రేమతో త్వరలో విడుదల అవుతుంది. ఆ వేంటనే కొరటాల దర్శకత్వంలో మరో సినిమా తీయబోతున్నాడు. ఇలాంటి సమయంలో రిమేక్ చిత్రం త్వరగా డిసైడ్ చేయలేని పరిస్థితి అందుకే ఆ సినిమా పై దృష్టి పెట్డం లేదని తెలుస్తుంది. కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజీ ప‌ట్టాలెక్క‌నుంది. ఇటీవల పూజాకార్యక్రమాలను జరుపుకొన్న ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జనవరి నుంచి మొదలు కానుంది. అనంతరం తన అన్న కళ్యాణ్ రామ్ సొంత బ్యానర్ లో మరో సినిమా చేయాల్సి ఉంది.

వేదలం చిత్రంలో అజిత్


ఇక ఎలాగూ ఎన్టీఆర్ నుంచి లేక్ క్లీయర్ కాబట్టి  ఫుల్ మాస్ ఇమేజ్ ఉన్న త‌న‌కు ఈ క‌థ బాగా సూట్ అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో ఉన్నాడు చిరంజీవి. అందుకే ఈ సినిమాపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అజిత్ హీరోగా.. శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఇప్ప‌టికే అనూహ్య రీతిలో వ‌సూళ్లు రాబ‌డుతుండడం విశేషం. మరి  ఈ సినిమా గనక చిరంజీవి నటిస్తే మరోసారి తెలుగు ఇండస్ట్రీలో రికార్డుల మోత మోగుతుంది అంటున్నారు మెగా ఫ్యామిలీ, మెగా అభిమానులు. 


మరింత సమాచారం తెలుసుకోండి: